Jr.NTR: తారక్ పెట్టుకున్న కొత్త వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన RRR చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం మొత్తం సక్సెస్ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం ముంబై లో జరిగిన సక్సెస్ పార్టీలో సందడి చేశారు.
ఈ సక్సెస్ పార్టీలో ఎన్టీఆర్ చేతి వాచీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతే కాకుండా పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ చేతికి ఉన్న ఆ వాచి ఏ కంపెనీది, దాని ధర ఎంత?వాటి గురించి ఆరా తీయగా ఎన్టీఆర్ చేతికి ఉన్న ఆ వాచీ ధర దాదాపుగా కోటిన్నరకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
ఆ వాచ్ పేరు Patek Philippe Nautilus 5712 1/A. అయితే ఈ వాచ్ ని సొంతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్ దాదాపుగా కోటి 70 లక్షలకు పైగానే ఖర్చు చేసినట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు కార్లన్న వాచీలన్నా ఎక్కువ ఇష్టం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ తో పాటుగా అలాంటివి ఇంకా చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ ధరించిన ఆ బ్రాండ్ లో లభించే ప్రతి ఒక్క వాచ్ కూడా చాలా ఖరీదైనదే.
ఇకపోతే కరోనాకి ముందు జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ ను ధరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ ధరించిన ఆ ఖరీదైన వాచ్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. రిచర్డ్ మిల్లే RM కి చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ అనే బ్రాండ్ వాచ్ ను ధరించారు ఎన్టీఆర్. అయితే ఆ వాచ్ ధర దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు. ఇకపోతే మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లను సాధించింది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో సక్సెస్ పార్టీ నిర్వహించారు మూవీ మేకర్స్.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…