హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం (Sravana Masam 2025) అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటి. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలకు విశేష ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. శివుడు, లక్ష్మీదేవి, విష్ణువులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో మహిళలు ప్రత్యేకించి లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తారు. తమ కోరికలు నెరవేరాలని, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటారు.
శ్రావణ మాసంలోని శుక్రవారాలకు ప్రత్యేకత ఉంది. ఇందులోనూ చివరి శుక్రవారం జరుపుకునే వరలక్ష్మీ వ్రతం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం, సంపద, ఐశ్వర్యం మరియు సౌభాగ్యం కోసం ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల పెళ్లికాని యువతులకు తమకు తగిన గుణవంతుడైన భర్త లభిస్తారని ప్రగాఢ విశ్వాసం. వివాహితలు తమ భర్త దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా ఉండాలని, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటారు. వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
వరలక్ష్మీ వ్రతాన్ని సరైన సమయాల్లో ఆచరించడం చాలా ముఖ్యం. ఈసారి వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8వ తేదీ, శుక్రవారం రోజు జరుపుకుంటారు. పూజకు అనుకూలమైన శుభ ముహూర్తాలను పండితులు ఇలా సూచిస్తున్నారు:
అయితే, పండితుల హెచ్చరికల ప్రకారం, ఉదయం 10:30 గంటల నుంచి 12:00 గంటల మధ్య పూజ చేయడం అశుభం. ఈ సమయం రాహు కాలం కావడంతో ఈ సమయంలో పూజ చేస్తే కటిక పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, పనులకు ఆటంకాలు ఎదురవుతాయని, పూజ చేసిన ఫలితం దక్కదని హెచ్చరిస్తున్నారు.
వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడంతో పాటు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.
ఈ నియమాలను కచ్చితంగా పాటిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే, లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సకల శుభాలు పొందవచ్చని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సౌఖ్యం, ఐశ్వర్యం మరియు ఆనందం చేకూరుతాయని విశ్వసిస్తారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…