హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం (Sravana Masam 2025) అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటి. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలకు విశేష ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. శివుడు, లక్ష్మీదేవి, విష్ణువులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో మహిళలు ప్రత్యేకించి లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తారు. తమ కోరికలు నెరవేరాలని, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటారు.
శ్రావణ మాసంలోని శుక్రవారాలకు ప్రత్యేకత ఉంది. ఇందులోనూ చివరి శుక్రవారం జరుపుకునే వరలక్ష్మీ వ్రతం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం, సంపద, ఐశ్వర్యం మరియు సౌభాగ్యం కోసం ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల పెళ్లికాని యువతులకు తమకు తగిన గుణవంతుడైన భర్త లభిస్తారని ప్రగాఢ విశ్వాసం. వివాహితలు తమ భర్త దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా ఉండాలని, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటారు. వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
వరలక్ష్మీ వ్రతాన్ని సరైన సమయాల్లో ఆచరించడం చాలా ముఖ్యం. ఈసారి వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8వ తేదీ, శుక్రవారం రోజు జరుపుకుంటారు. పూజకు అనుకూలమైన శుభ ముహూర్తాలను పండితులు ఇలా సూచిస్తున్నారు:
అయితే, పండితుల హెచ్చరికల ప్రకారం, ఉదయం 10:30 గంటల నుంచి 12:00 గంటల మధ్య పూజ చేయడం అశుభం. ఈ సమయం రాహు కాలం కావడంతో ఈ సమయంలో పూజ చేస్తే కటిక పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, పనులకు ఆటంకాలు ఎదురవుతాయని, పూజ చేసిన ఫలితం దక్కదని హెచ్చరిస్తున్నారు.
వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడంతో పాటు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.
ఈ నియమాలను కచ్చితంగా పాటిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే, లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సకల శుభాలు పొందవచ్చని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సౌఖ్యం, ఐశ్వర్యం మరియు ఆనందం చేకూరుతాయని విశ్వసిస్తారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…