ముఖం అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అటు పురుషులు అయినా ఇటు మహిళలు అయినా ఫేస్ మంచిగా ఉంటేనే ఎదటి వారు మనల్ని చూసే విధానంలో మార్పు ఉంటుంది. అందుకే ఈ అందమైన ముఖం సొంతం చేసుకోవడానికి దానికి ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనకాడరు.
ఇప్పటికే మహిళలకు, పురుషులకు బయట దొరికే ఎన్నో క్రీమ్ లు, ఫేస్ వాష్ కు సంబంధించిన ఎన్నో రకాల ఐటెంలు ఉన్నాయి. వాటిని ముఖానికి అప్లై చేస్తూ మేకప్ వేసుకుంటారు. అయితే కొంతమందికి ఇలా ముఖానికి ఎన్నిపూసినా.. ముఖం మాత్రం అందంగా తయారవదు. ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలు కూడా కనపడి.. చూడటానికి అంద విహీనంగా ఉంటారు.
అయితే కింద చెప్పిన చిట్కా వాడితే ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది. ఈ చిట్కాకు ఉపయోగపడేవి ఏంటంటే.. పసుపు, రోజ్ వాటర్. పసుపును పురాతన కాలం నుంచి కూడా సౌందర్య రక్షణలో ఉపయోగిస్తున్నాం.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక స్పూన్ పసుపులో రెండు స్పూన్ల రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేయాలి.
ఇలా చేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ముఖంపై మసాజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే ఫలితం ఉంటుందని.. ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు అనేవి ఉండవని నిపుణులు చెబుతున్నారు. రోజ్ వాటర్ లో ముఖంపై ఉండే చెడు వ్యర్థాలను తొలగించే గుణం ఉంటుందని చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…