ముఖం అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అటు పురుషులు అయినా ఇటు మహిళలు అయినా ఫేస్ మంచిగా ఉంటేనే ఎదటి వారు మనల్ని చూసే విధానంలో మార్పు ఉంటుంది. అందుకే ఈ అందమైన ముఖం సొంతం చేసుకోవడానికి దానికి ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనకాడరు.
ఇప్పటికే మహిళలకు, పురుషులకు బయట దొరికే ఎన్నో క్రీమ్ లు, ఫేస్ వాష్ కు సంబంధించిన ఎన్నో రకాల ఐటెంలు ఉన్నాయి. వాటిని ముఖానికి అప్లై చేస్తూ మేకప్ వేసుకుంటారు. అయితే కొంతమందికి ఇలా ముఖానికి ఎన్నిపూసినా.. ముఖం మాత్రం అందంగా తయారవదు. ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలు కూడా కనపడి.. చూడటానికి అంద విహీనంగా ఉంటారు.
అయితే కింద చెప్పిన చిట్కా వాడితే ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది. ఈ చిట్కాకు ఉపయోగపడేవి ఏంటంటే.. పసుపు, రోజ్ వాటర్. పసుపును పురాతన కాలం నుంచి కూడా సౌందర్య రక్షణలో ఉపయోగిస్తున్నాం.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక స్పూన్ పసుపులో రెండు స్పూన్ల రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేయాలి.
ఇలా చేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ముఖంపై మసాజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే ఫలితం ఉంటుందని.. ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు అనేవి ఉండవని నిపుణులు చెబుతున్నారు. రోజ్ వాటర్ లో ముఖంపై ఉండే చెడు వ్యర్థాలను తొలగించే గుణం ఉంటుందని చెబుతున్నారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…