కొంతమందికి ప్రయాణాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే.. కొంచెం దూరం ప్రయాణం చేసినా వాళ్లు వాంతులు చేసుకుంటారు. అలా అని అన్ని వాహనాలపై ప్రయాణానికి ఉంటుందని కాదు.. కొంతమందికి బస్సు పడదు, మరికొంతమందికి ఆటో.. మరికొంతమందికి బైక్ ఇలా చాలా వరకు ఉంటాయి.
ఇంకా కొంతమందికి రైలు ప్రయాణం అంటే కూడా భయపడుతుంటారు. దీనికి మెయిన్ కారణం వాంతులు అవుతాయనే కారణం. అందుకే ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు ప్రయాణం చేయాలంటే వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడే వారు ఏం చేయాలి.. ఏం తీసుకుంటే బాగుంటుంది అనేవి ఇక్కడ తెలుసుకుందాం.
ఇక్కడ చెప్పే కొన్ని చిన్న చిట్కాలు వాడితే ఆ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు. ఏ వాహనంలో ఎక్కినా వాంతు సమస్య ఉన్న వ్యక్తి ముందు సీట్లో కూర్చొవడానికి ట్రై చేయాలి. దీంతో ఆ ఆలోచన నుంచి బయటపడి.. బయట వైపు చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇక మన పక్కన కూర్చున్న వ్యక్తితో మాట్లాడటం వల్ల కూడా ఈ సమస్య ఉన్నవారు తప్పించుకోవచ్చు.
పుస్తకాలు చదవడం.. మొబైల్ ఫోన్ చూడటం వంటివి చేస్తుండాలి. ఇలా వర్కౌట్ కాకపోతే ప్రయాణ సమయంలో అల్లం తీసుకుంటే వాంతి అనేది రాదు. కొంతమందికి నిమ్మకాయ వాసన చూసినా వాంతులు అనేవి రావు. ఏదేమైనా ప్రయాణ సందర్భంలో మనకు వాంతు వస్తుందన్న భావన, ఆలోచన అనేది తీసుకురాకుండా ఉండాలి. ఇలా చేస్తే పైన చెప్పినవి కూడా పాటించాల్సిన అవసరం లేదు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…