దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. కొన్ని వేల పాటలను పాడారు. ఏ వేరియేషన్లో పాడాలన్నా అతడికి అతనే సాటి. అంత అద్భుతంగా పాడతారు. అతడి పాటలు నచ్చని వారంటూ ఉండరు. పాత తరం దగ్గర నుంచి కొత్త తరం వరకు.. ఎవరి అభిరుచులకు తగ్గట్టూ అలా పాడుతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ లోకాన్ని విడిచి పెట్టాల్సి వచ్చింది.. ఈ సంగీత శిఖరం.
కానీ ఆయన చనిపోయి సంవత్సరం గడిచి పోతున్నా.. అతడి పాటలు మాత్రం ప్రతీ ఒక్కరి గుండెల్లో నాటుకుపోయాయి. ఇక బుల్లితెరపై అతడు పాడుతా.. తీయగా అనే ప్రోగ్రాంను రన్ చేసిన విషయం తెలిసిందే. అతడు మరణించిన తర్వాత కాస్త దానికి బ్రేక్ వచ్చింది. 25 సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులతో ఈ కార్యక్రమం అనుబంధం ఉంది.
ఈ పాడుతా తీయగా 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుందని ఈటీవీ పేర్కొంది. 25 ఏళ్లక్రితం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎందరో యువ గాయకులను సమాజానికి పరిచయం చేసింది. 18 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని, త్వరలో ప్రారంభంకానున్న 19వ సీజన్ పాడుతా తీయగా కోసం ఈటీవీ భారీ కసరత్తు చేస్తున్నట్లు ఈటీవీ యాజమాన్యం పేర్కొంది.
కరోనా కారణంగా మధ్యలో గ్యాప్ వచ్చింది. దానిలోనే ఆన్లైన్ ఆడిషన్స్ నిర్వహించింది. 4 వేలమంది గాయనీగాయకుల స్వరాలను నిర్ణేతల పరీక్షించి వారిలో నుంచి 16 మంది కళాకారులను ఎంపిక చేసినట్లు ఈటీవీ యాజమాన్యం తెలిపింది. షోను నిర్వహించే బాధ్యతను బాలు కుమారుడు ఎస్పీ చరణ్ స్వీకరిస్తున్నట్లు పేర్కొంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…