దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. కొన్ని వేల పాటలను పాడారు. ఏ వేరియేషన్లో పాడాలన్నా అతడికి అతనే సాటి. అంత అద్భుతంగా పాడతారు. అతడి పాటలు నచ్చని వారంటూ ఉండరు. పాత తరం దగ్గర నుంచి కొత్త తరం వరకు.. ఎవరి అభిరుచులకు తగ్గట్టూ అలా పాడుతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ లోకాన్ని విడిచి పెట్టాల్సి వచ్చింది.. ఈ సంగీత శిఖరం.
కానీ ఆయన చనిపోయి సంవత్సరం గడిచి పోతున్నా.. అతడి పాటలు మాత్రం ప్రతీ ఒక్కరి గుండెల్లో నాటుకుపోయాయి. ఇక బుల్లితెరపై అతడు పాడుతా.. తీయగా అనే ప్రోగ్రాంను రన్ చేసిన విషయం తెలిసిందే. అతడు మరణించిన తర్వాత కాస్త దానికి బ్రేక్ వచ్చింది. 25 సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులతో ఈ కార్యక్రమం అనుబంధం ఉంది.
ఈ పాడుతా తీయగా 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుందని ఈటీవీ పేర్కొంది. 25 ఏళ్లక్రితం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎందరో యువ గాయకులను సమాజానికి పరిచయం చేసింది. 18 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని, త్వరలో ప్రారంభంకానున్న 19వ సీజన్ పాడుతా తీయగా కోసం ఈటీవీ భారీ కసరత్తు చేస్తున్నట్లు ఈటీవీ యాజమాన్యం పేర్కొంది.
కరోనా కారణంగా మధ్యలో గ్యాప్ వచ్చింది. దానిలోనే ఆన్లైన్ ఆడిషన్స్ నిర్వహించింది. 4 వేలమంది గాయనీగాయకుల స్వరాలను నిర్ణేతల పరీక్షించి వారిలో నుంచి 16 మంది కళాకారులను ఎంపిక చేసినట్లు ఈటీవీ యాజమాన్యం తెలిపింది. షోను నిర్వహించే బాధ్యతను బాలు కుమారుడు ఎస్పీ చరణ్ స్వీకరిస్తున్నట్లు పేర్కొంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…