ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం అల్ల కల్లోలం సృష్టిస్తుంది. ఎక్కడో చైనాలో మొదలైన కోవిడ్-19 ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. మన దేశంలో కూడా రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. యావత్ దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండిపోయింది. దేశంలోని ప్రజలంతా భయంతో విలవిలలాడుతుంటే మరో వైపు కొందరు ఈ వినోదంలా అనిపిస్తుంది. తాజాగా బెంగుళూరులోని ఇన్ఫోసిస్ ఉద్యోగి ముజీబ్ మహమ్మద్ “అందరు ఇళ్లలో కాకుండా బయట వీధుల్లోకి వెళ్లి తుమ్మలని కరోనా వైరస్ ని వ్యాపింపచేయాలంటూ…” పేస్ బుక్ లో పోస్టు పెట్టాడు.
ఇటువంటి విపత్కర సమయంలో ఇటువంటి పోస్టు పెట్టిన ఇతడిని పోలీసులు ఆరెస్ట్ చేసి కేసు పెట్టారు. అంతేకాదు ఇతని చర్య తమ నియమావళికి విరుద్ధమని, ఇది కావాలనే అతడు చేసినట్టుగా అనిపిస్తుందని ఇన్ఫోసిస్ యాజమాన్యం కూడా అతనిని తమ సర్వీసులనుంచి తప్పిస్తున్నట్టుగా ఆ ఇన్ఫోసిస్ పేర్కొంది. ఇతడి చర్య వల్ల సంస్థ ప్రతిష్ట డెబ్బదినేలా ఉందని పేర్కొంది. అసలే దేశంలో 900 లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 20కి చేరుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తూ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి గట్టి నివారణా చర్యలు తీసుకుంటున్నందుకు చాలా వరకు మరణాలను నియంత్రించ గలిగామని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరో పక్క ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే ముజీబ్ వంటి ఉద్యోగుల పట్ల ఆయా సంస్థలు కఠినంగా వ్యవహరించాలని కోతురున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…