కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యావత్ భారతదేశం మొత్తం లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ మహానగరాన్ని లాక్ డౌన్ విధించింది. అయితే శనివారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై తెలంగాణా వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.
హైదరాబాద్ లోని ఇప్పటి వరకు ఎటువంటి ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించలేదని స్పష్టం చేసారు.. తప్పుడు సమాచారంతో ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దని ప్రచార మాధ్యమాలను కోరారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని. కరోనా బాదితులందరి పరిస్థితి నిశితంగా గమనిస్తున్నామని ఏ ఒక్క బాధితుడికి కూడా ఆందోళనకరంగా లేదని చెప్పారు.
కరోనా వైరస్ గాలితో వచ్చేది కాదని, కేవలం ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఇతరులకు సోకుతుందని వివరించారు. మరియు గచ్చిబౌలిలో 1500 మందికి పైగా క్వారంటైన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పనులు మరో ఆరు రోజుల్లో యుద్ధప్రాతిపదికన పూర్తీ చేస్తామని తెలిపారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…