ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోను విస్తరిస్తుంది. ఇప్పటికీ దేశంలో 900లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 వరకు కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వ్యాపార దిగ్గజం టాటా ట్రస్ట్ సంస్థ కరోనా పై పోరు కోసం రూ.500 వెచ్చించనున్నట్టు టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా ట్విట్టర్ లో ప్రకటన చేసారు. “ప్రస్తుతం ప్రపంచంతో పాటు దేశం కూడా కోవిడ్-19తో తీవ్ర సంక్షభంలో ఉంది. ఈ సంక్షభంనుంచి బయటపడాలంటే సత్వర చర్యలు అవసరం. ప్రతి గంటా ఎంతో విలువైనది. జాతిమొత్తం ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. మన ముందు ఉన్న కష్టతరమైన సవాల్ ఇది. టాటా ట్రస్ట్ జాతి రక్షణకు ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ కరోనా వైరస్ పోరులో అనునిత్యం శ్రమిస్తున్న వారికీ, కరోనా భాదితులకు సాయం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించాం.” అని రతన్ టాటా తెలిపారు.
కరోనా వైరస్ భాదితులకు సేవలందించే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి, బాధితులకు వైద్య పరికరాలు, వైరస్ ను పరీక్షించేందుకు టెస్టింగ్ కిట్లు మరియు ప్రజలకు ఈ వైరస్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టాటా ట్రస్ట్, టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా కలిసి పనిచేస్తాయని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…
ఆహారంలో రంగు, వాసన కోసం మాత్రమే ఉపయోగించే కుంకుమపువ్వు నిజానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు.…
హైదరాబాద్లో ప్రేమ పేరుతో జరిగిన ఓ దొంగతనం కేసు తాజాగా బయటకు రావడం సంచలనంగా మారింది. ప్రియుడికి బర్త్డే గిఫ్ట్…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
మనిషి జీవితం ఎలా ఉండాలి? ఏ పనులు మంచివి, ఏవి దూరంగా ఉండాలి? అనే విషయాలను పురాణాలు స్పష్టంగా చెబుతాయి.…