ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోను విస్తరిస్తుంది. ఇప్పటికీ దేశంలో 900లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 వరకు కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వ్యాపార దిగ్గజం టాటా ట్రస్ట్ సంస్థ కరోనా పై పోరు కోసం రూ.500 వెచ్చించనున్నట్టు టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా ట్విట్టర్ లో ప్రకటన చేసారు. “ప్రస్తుతం ప్రపంచంతో పాటు దేశం కూడా కోవిడ్-19తో తీవ్ర సంక్షభంలో ఉంది. ఈ సంక్షభంనుంచి బయటపడాలంటే సత్వర చర్యలు అవసరం. ప్రతి గంటా ఎంతో విలువైనది. జాతిమొత్తం ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. మన ముందు ఉన్న కష్టతరమైన సవాల్ ఇది. టాటా ట్రస్ట్ జాతి రక్షణకు ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ కరోనా వైరస్ పోరులో అనునిత్యం శ్రమిస్తున్న వారికీ, కరోనా భాదితులకు సాయం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించాం.” అని రతన్ టాటా తెలిపారు.
కరోనా వైరస్ భాదితులకు సేవలందించే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి, బాధితులకు వైద్య పరికరాలు, వైరస్ ను పరీక్షించేందుకు టెస్టింగ్ కిట్లు మరియు ప్రజలకు ఈ వైరస్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టాటా ట్రస్ట్, టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా కలిసి పనిచేస్తాయని ఆయన తెలిపారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…