లేడీ ఓరియంటెడ్ మూవీ ఒసేయ్ రాములమ్మ తర్వాత అరుంధతి మూవీ వచ్చేవరకు మరో సక్సెస్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమా రాలేదు. ఒకవేళ వచ్చినా అంతగా విజయాన్ని సాధించలేదు. అమ్మోరు సినిమా తర్వాత వచ్చిన అంజి సినిమాకు గ్రాఫిక్స్ విభాగములో శ్యాం ప్రసాద్ రెడ్డి కి నేషనల్ అవార్డు వచ్చింది. సినిమా ఫెయిల్ అయిన నేషనల్ అవార్డు రావడంతో శ్యాం ప్రసాద్ రెడ్డి పడిలేచిన కెరటంలా అరుంధతి మూవీ తో బాక్సాఫీస్ పై తిరగబడ్డారు.
శ్యాం ప్రసాద్ రెడ్డి దూరపు బంధువు గద్వాల్ వచ్చినప్పుడు గద్వాల్ చరిత్ర గురించి చెప్పేది ఇది కథలో ప్రధానమైన అంశం కానప్పటికీ మూలాధారంగా మాత్రం నిలిచింది. చిన్నప్పుడు శ్యాం ప్రసాద్ రెడ్డి నానమ్మ గారు చెప్పిన జానపద కథలు గుర్తుకొచ్చి అలాంటి నేపథ్యం తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. తన రైటర్స్ ని పిలిచి అలాంటి మూల అంశంతో ఒక కథను పూర్తిగా సిద్ధం చేయించారు. ఆ కథకి అరుంధతి అనే టైటిల్ పెట్టారు.
అరుంధతి సినిమాలో విలన్ పాత్ర కి తమిళ నటుడు పశుపతిని అనుకున్నారు. కానీ ఆయన అంత అగ్రెసివ్ గా కనిపించకపోవడంతో ఆ పాత్ర కాస్తా సోనూసూద్ కు వెళ్ళింది. మరో ముఖ్య పాత్ర ఫకీర్ ముందుగా నానాపటేకర్ అనుకున్నారు కానీ ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ క్యారెక్టర్ శాయాజీ షిండే కి వెళ్ళింది. దర్శకుడిగా తమిళ డైరెక్టర్ సభాపతిని అనుకొని కొంత షూట్ చేసిన తర్వాత శ్యాం ప్రసాద్ రెడ్డి కి నచ్చకపోవడంతో అతని తొలగించి ఆ అవకాశం తన ఆస్థాన దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గరికి వెళ్ళింది.
ఇక ఇందులో అతి ముఖ్యమైన అరుంధతి పాత్ర ఒడ్డు పొడుగు అందంగా ఉండే అమ్మాయి కావాలి ముందుగా యమదొంగలో రెండో హీరోయిన్ గా చేసిన మమతా మోహన్ దాస్ అనుకున్నారు. కానీ ఆమెకు ఎవరో శ్యాం ప్రసాద్ రెడ్డి తో సినిమా అంటే దాదాపు 2,3 సంవత్సరాల సమయం తీసుకుంటుంది నీ కేరీర్ స్పాయిల్ అవుతుంది అన్నారు. దానితో ఆమె తప్పుకోగా ఆ అవకాశం అనుష్క దక్కించుకుంది. అనుష్క జేజమ్మ పాత్రలో తెలుగు ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకోవడం జరిగింది.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…