తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి అత్యధిక రికార్డులను నెలకొల్పిన మెగాస్టార్ కొద్ది కాలం సినిమాలకు విరామం చెప్పారు. ఈ క్రమంలోనే తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ లూసిఫర్ మలయాళ రీమేక్ చిత్రంలో నటించనున్నారు. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.
చిరు బాబీకాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నిజానికి బాబీ ఈ సినిమా స్క్రిప్ట్ ను మెగాస్టార్ చిరంజీవి కోసం కాదని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కోసం స్క్రిప్ట్ తయారు చేశారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించడం కోసం విజయ్ దేవరకొండకు డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో.. ఈ సినిమాను రిజెక్ట్ చేసారట విజయ్. అయితే ఆ తరువాత ఈ సినిమా కథ మెగాస్టార్ కు బాబీ వినిపించారని తెలుస్తోంది.
బాబీ ఈ కథను చిరంజీవికి చెప్పడంతో వెంటనే చిరంజీవి ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో చిరంజీవి గారికి తగ్గట్టుగా కథలో మార్పులు చేసినట్లు తెలిపారు.మరి నెట్టింట్లో వైరల్ గా మారిన ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్నారు.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…