హీరో హీరోయిన్, హీరో దర్శకుడు, హీరో నిర్మాత ఇలా ఎవరైనా కావచ్చు ఒక్కోసారి ఈ కాంబినేషన్ కు విపరీతమైన క్రేజ్ వస్తుంది. మరొకసారి ఎన్నిసార్లు ఈ కాంబినేషన్ రిపీట్ అయిన ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. అలాంటిదే ఏఎన్ఆర్ మిగతా నలుగురు అగ్రహీరోలతో కలిసి నటించిన సినిమాల విషయంలో జరిగింది.
1986లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇదే సంవత్సరం వైజయంతి మూవీస్, అశ్వినీదత్ నిర్మాణం, మురళీమోహన్ రావు దర్శకత్వంలో బ్రహ్మరుద్రులు చిత్రం విడుదలయ్యింది.
ఈ సినిమాలో వెంకటేష్, రజిని హీరో, హీరోయిన్లతో ఏఎన్నార్ కలిసి నటించారు. బ్లాక్ బస్టర్ కలియుగ పాండవులు చిత్రం తర్వాత ఈ చిత్రం మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగుముఖం పట్టింది.
ఆ తర్వాత 1990 అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని వెంకట్ నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘ఇద్దరూఇద్దరే’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో కనిపించగా, నాగార్జున, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండో సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని మూటకట్టుకుంది.
1993 గీతా ఆర్ట్స్ నిర్మాణం, అల్లు అరవింద్ నిర్మాణం, బి.గోపాల్ దర్శకత్వంలో ‘మెకానిక్ అల్లుడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి కలిసి నటించారు. చిరంజీవి, నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మొదటి, చివరి చిత్రంగా మెకానిక్ అల్లుడు చెప్పుకోవచ్చు. బి.గోపాల్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం స్టేట్ రౌడీ సూపర్ డూపర్ హిట్ కాగా మెకానిక్ అల్లుడు చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది.
1994 సంపత్ కుమార్ నిర్మాణం, ప్రియదర్శన్ దర్శకత్వంలో గాండీవం చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ, రోజా హీరోహీరోయిన్లు నటించగా ప్రధాన పాత్రల్లో నాగేశ్వరరావు, మోహన్ లాల్ కలిసి నటించారు. ‘గోరువంక వాలగానే గోకులానికి.. అనే పాట ఆ రోజుల్లో ప్రజాదరణ పొందింది. అయినా సినిమా పరాజయం పొందింది. ఇలా అక్కినేని నాగేశ్వరరావు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తో నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…