తెలుగు సినిమాలలో పర భాషా నటీమణులు హీరోయిన్స్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇప్పటి వ్యవహారం కాదు. ఎన్నో ఏళ్ళుగా వస్తూనే ఉంది. తమిళం, మలయాళం, కన్నడ భాషలలో హీరోయిన్స్గా పాపులర్ అయిన వాళ్ళు, లేదా కొత్తగా సిని ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళకి మన టాలీవుడ్ మేకర్స్ బాగానే అవకాశాలిస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు ఫ్లాపయినా అమ్మాయి నేచర్ మంచిదైతే మరో రెండు సినిమాలు ఇచ్చైనా సరే స్టార్ హీరోయిన్ అయ్యేవరకు సపోర్ట్ చేస్తుంటారు. అయితే వీరు కాస్తో కూస్తో తెలుగు భాష నేర్చుకోవడానికి, భాష మీద పట్టు సాధించడానికి బాగా కష్టపడుతున్నారు కూడా.
నిత్యా మీనన్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న, కీర్తి సురేశ్ లాంటి వారు తెలుగు నేర్చుకేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ధారాళంగా తెలుగులో మాట్లాడేందుకు, సొంతగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ యాసలో గానీ, ఇతర యాసలో గానీ సినిమాలోని పాత్ర మాట్లాడాల్సి ఉంటే ప్రత్యేకంగా ఓ ట్యూటర్ను నియమించుకొని మరీ భాష మీద, యాస మీద పట్టు తెచ్చుకుంటున్నారు. షూటింగ్ స్పాట్లో కూడా అసిస్టెంట్స్తో తెలుగులోనే మాట్లాడుతూ నేర్చుకుంటున్నారు. ఇటీవల పుష్ప సినిమా కోసం రష్మిక మందన్న సొంతగా డైలాగులు చెప్పేందుకు కొన్నాళ్లు ఓ ట్యూటర్ను పెట్టుకున్నారు.
దాదాపు సౌత్ హీరోయిన్స్ తెలుగు సినిమాలకి వారే సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. కానీ బాలీవుడ్ నుంచి వస్తున్న హీరోయిన్స్ మాత్రం దీనిని అంతగా పట్టించుకోవడం లేదు. ఏదో వచ్చామా, షూటింగ్ చేశామా ..రెమ్యునరేషన్ తీసుకున్నామా వెళ్ళిపోయామా అనేట్టుగా ఉంటున్నారు. అందుకే బాలీవుడ్ హీరోయిన్స్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. ప్రభాస్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాతో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండదు.
ఇక ప్రభాస్ – యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియన్ సినిమా సాహోలో నటించిన శ్రద్ద కపూర్ పరిస్థితి కూడా ఇంతే. డైలాగులు చెప్పడానికి పెదాలు కదిపినట్టు అనిపిస్తుంది తప్ప సీన్ ఏంటి.. ఇందులో డైలాగులు ఏంటీ.. ఎలాంటి మూడ్లో డైలాగులు చెప్పాలి అనే స్పష్ఠత లేకుండా నటించేసినట్టు కనిపిస్తుంది. సాహో సినిమాలో హీరోయిన్గా నటించిన శృద్దా కపూర్ మన తెలుగు ప్రేక్షకులను ఎంతమాత్రం కనెక్ట్ కాలేకపోయింది. దాంతో నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ అంటే బాలీవుడ్ హీరోయిన్స్ని తీసుకోవాలనే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆయన నటిస్తున్నవన్ని పాన్ ఇండియన్ సినిమాలు కాబట్టే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ని తీసుకుంటున్నారనేది తెలిసిన విషయమే. కానీ వారికి మన భాష అర్థం కాక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలాగో పెడుతున్నారు. అంత కరెక్ట్గా సన్నివేశాలలో జీవించలేకపోతున్నారు. అదే సినిమాకి పెద్ద మైనస్ అవుతోంది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్ కృతి సనన్. ఈమెకి కొంత తెలుగు భాష మీద అవగాహన ఉంది. మహేష్ బాబుతో 1 నేనొక్కడినే, నాగ చైతన్యతో దోచేయ్ సినిమాలు చేసింది. కానీ నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో మాత్రం దీపిక పదుకొణ్కి మాత్రం తెలుగు ఏమాత్రం రాదు. మరి ఈ సినిమాల పరిస్థితేంటో చూడాలి.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…