సినీ పరిశ్రమలో తాము కాకుండా పాత్రలే కనిపించే నటనను కనబరిచే అతి కొద్దిమంది నటుల్లో శుభలేక సుధాకర్ ఒకరు.అర్థం కాని హావభావాలు,మితిమీరిన నటనను పక్కకు పెట్టి, పాత్రోచితంగా నటించడం శుభలేఖ సుధాకర్ సొంతం. శుభలేఖ అనేది ఆయన ఇంటిపేరు కాదు. 1982 విజయసాయి ఫిలిమ్స్, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శుభలేఖ’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, సుమలత హీరో, హీరోయిన్లుగా నటించగా.. సుధాకర్, తులసి ఒక జంటగా కనిపించారు. సినిమా విజయవంతం అవడంతో సుధాకర్ కి మంచి పేరు వచ్చింది. ఇక అప్పటినుంచి సుధాకర్ కాస్త శుభలేఖ సుధాకర్ అయ్యారు.
ఆయన మంత్రిగారి వియ్యంకుడు, రెండుజెళ్ళసీత లాంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించారు. ఆ తరువాత సుధాకర్ కి 1986లో సీనియర్ వంశీ దర్శకత్వంలో వచ్చిన “లేడీస్ టైలర్” చిత్రం శుభలేఖ సుధాకర్ ని మరో మెట్టు ఎక్కించింది. నిజంగా ఈ సినిమా అతని కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ తరువాత 1989 రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ చిత్రంలో నాగార్జున కాలేజి స్నేహితుడిగా శుభలేఖ సుధాకర్ మంచి నటనను కనబరిచారు. ఈ చిత్రం విజయవంతమవడంతో శుభలేఖ సుధాకర్ కి మరిన్ని అవకాశాలు వచ్చాయి.
అలా కొన్ని చిన్న పాత్రలు చేసుకుంటూ.. 1995లో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, పీసీ.శ్రీరామ్ దర్శకత్వంలో ‘ద్రోహి’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అర్జున్, గౌతమి హీరో, హీరోయిన్లుగా నటించారు. సమాజానికి పట్టిన చీడ పురుగులను అరికట్టడంలో ధైర్యవంతులైన పోలీస్ పాత్రలో కమల్ హాసన్, అర్జున్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. లోగడ అర్జున్ ఇలాంటి పాత్రలో కనిపించారు. కానీ ఈ సినిమాలో కమల్ హాసన్ విభిన్నమైన పోలీస్ పాత్రలో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. సినిమా విజయానికి పీసీ.శ్రీరామ్ కెమెరా పనితనం అధనపు ఆకర్షణగా నిలిచింది.
కథలోకి వెళితే.. పై ఆదేశాల మేరకు శుభలేఖ సుధాకర్, అతనితో మరొక మహిళ కమలహాసన్ ఇంట్లో అతిథులుగా చేరుతారు. కమల్ హాసన్ డ్యూటీ పై ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. మానవతా విలువలు మరిచిపోయి ఉగ్రవాది(శుభలేఖ సుధాకర్), గౌతమీ పై అత్యాచారానికి పాల్పడతాడు. ఆ క్రమంలో గౌతమి శుభలేక సుధాకర్ కు లొంగిపోయినట్టుగా నటించి చివరికి పిస్టల్ తో ఉగ్రవాదిని (శుభలేఖ సుధాకర్ ను) కాల్చి చంపుతుంది. ఈ సీన్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకొని.. గౌతమి, శుభలేఖ సుధాకర్ ను అలా చేయడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. శుభలేఖ సుధాకర్ షూటింగ్ సమయంలో అలా చేసినందుకు.. క్షమించండి మేడం అని పదే పదే చెప్పడం జరిగిందని గౌతమి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
హిందూ దేవాలయ నిర్మాణంలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యమైనది ధ్వజస్తంభం ఏర్పాటు. ఏ ఆలయానికి…
జ్యోతిష్య విశ్వాసాల్లో శని Dev ప్రత్యేక స్థానం కలిగిన దేవతగా భావిస్తారు. కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవుడిగా ఆయనను…
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ స్థానం కలిగిన Srisailam Temple క్షేత్రానికి భక్తుల రాకపోకలు ఎప్పుడూ కొనసాగుతూనే…
తలనొప్పి అనగానే చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఒక వైపున గుచ్చినట్లుగా తీవ్రంగా వచ్చే నొప్పి, దానికి తోడు…
వేసవికాలం మొదలైనప్పుడల్లా శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల కోసం చాలా మంది వెతుకుతుంటారు. బయట దొరికే కూల్డ్రింక్స్ తాత్కాలికంగా చల్లదనం…
తెలుగు వంటల్లో పాతకాలపు రుచులకు ప్రత్యేక స్థానం ఉంది. కాలం మారుతున్న కొద్దీ కొత్త రకాల ఫుడ్ అలవాట్లు పెరిగినా,…