మల్టీస్టారర్ చిత్రాలు ఇప్పుడే కొత్తగా వచ్చినవి కావు. ఆనాటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నుంచి ఈ చిత్రాలు వస్తూనే ఉన్నాయి. జనరేషన్స్ మారిన కొద్దీ.. కొత్త నీరు రావడం, పాత నీరు పోవడం అనేది జరుగుతుంది. అలా ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ హీరోస్ మల్టీ స్టారర్ గా నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలువగా మరి కొన్ని చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. అలా కృష్ణ, శోభన్ బాబు ఒక మల్టీ స్టారర్ చిత్రం… కృష్ణంరాజు, కృష్ణ మరొక మల్టీస్టారర్ చిత్రాలు తెలుగు సినీ ప్రేక్షకులను రంజింపజేసాయి.
అయితే “దో ఆంఖే బారా హాత్” అనే విజయవంతమైన చిత్రాన్ని బాలీవుడ్ నుంచి రీమేక్ చేస్తూ ‘మా దైవం’ అనే చిత్రాన్ని ఎన్టీ రామారావు తో తీయడం జరిగింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగు ముఖం పట్టింది. ఆ సినిమా పరాజయం అయినప్పటికీ ఎందుకో రచయిత సత్యానంద్ కు ఆ కథ బాగా నచ్చింది. ఆ సినిమాలోని మూల కథను తీసుకొని చాలా వరకు మార్పులు చేర్పులు చేసుకొని ఓ కొత్త కథ సిద్ధం చేసి హీరో శోభన్ బాబు, కృష్ణ లకు వినిపించారు. ఆ కథ బాగా నచ్చడంతో వారిద్దరూ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. లోగడ శోభన్ బాబు, కృష్ణ కాంబోలో వచ్చిన ముందడుగు చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో.. మరో ముందడుగు వేసి ఈ చిత్రంలో కలిసి నటించారు.
అలా 1983 లో మద్రాసులోని వాహినీ స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కైకాల సత్యనారాయణ తమ్ముడు నాగేశ్వరరావు నిర్మాతగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఇద్దరు దొంగలు’ చిత్రం విడుదలయ్యింది. ఇందులో శోభన్ బాబు, కృష్ణ, జయసుధ, రాధా హీరో హీరోయిన్లుగా నటించారు. అనుకున్నట్టుగ 1983 విజయదశమికి విడుదల కావలసిన ఈ చిత్రం రాఘవేందర్ రావు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయనకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ క్రమంలో సినిమా విడుదల తేదీని సంక్రాంతికి వాయిదా వేశారు. టి. త్రివిక్రమరావు నిర్మాణం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘యుద్ధం’ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఈ చిత్రంలో కృష్ణంరాజుతో కృష్ణ మరొక హీరోగా నటించగా జయసుధ, జయప్రద హీరోయిన్లుగా నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “ఇద్దరు దొంగలు”.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “యుద్ధం” చిత్రం ఈ రెండు సినిమాలు 1984 జనవరి 14న విడుదలయ్యాయి. విచిత్రమేమంటే దాసరి దర్శకత్వంలో వచ్చిన యుద్ధం సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తాకొట్టగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు దొంగలు చిత్రం విజయవంతమయ్యింది. ఈ రెండు మల్టీస్టారర్ చిత్రాల్లో హీరో కృష్ణ నటించడం గమనార్హం. ఇలా ఒకే తేదీన ఒకే హీరో చిత్రాలు విడుదలవడమన్నది ఇదే ప్రథమం.
ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులు, అసమతుల్య ఆహారం, ఒత్తిడి కారణంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య…
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…