ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి గురించి వైసిపి నాయకులు అవమానకరంగా మాట్లాడటంతో సభ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోరున విలపించారు. ఈ క్రమంలోనే ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. ఇకపోతే ఈ ఘటన అనంతరం నందమూరి హీరోలు ఈ ఘటనపై ఘాటుగా విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా ఈ విషయం గురించి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈమె ఈ విషయం గురించి స్పందించారు. తాజాగా భువనేశ్వరి ఈ విషయంపై మాట్లాడుతూ టీవీలో తన భర్త చంద్రబాబునాయుడు ఏడవడం చూసి ఆమె ఇంట్లో ఏడ్చారని సమాచారం. మీడియా సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంటికి రావడంతో వారిని చూసి ఈమె మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ ఘటన అనంతరం బయటపడిన భువనేశ్వరి చంద్రబాబు నాయుడుకి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని మనసులో నుంచి తుది చేయమని ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకని చెప్పారు. దిగజారిన మనుషులు ఎలాంటి మాటలైనా మాట్లాడతారు అలాంటివి మనసులో పెట్టుకోకూడదని భువనేశ్వరి చంద్రబాబు నాయుడుకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.
రాజకీయాలలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ విధమైనటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది గతంలో నాన్న గారి హయాంలో కూడా ఇలాంటి వారు ఎన్నో మాటలతో మనసును ఎంతో ఇబ్బంది పెట్టారని, ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వాటిని పక్కనపెట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని ఈమె సూచించినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…