సినీ పరిశ్రమలో ఒక్కో దర్శకుడికి ఒక్కో బ్రాండ్ ఉంటుంది. పౌరాణిక, సాంఘిక, జానపద, కౌబాయ్, మాస్, కుటుంబ, ప్రేమ కథా చిత్రాల దర్శకులని పేరు ఉంటుంది. అలాంటి కోవలోకే ముత్యాల సుబ్బయ్య వస్తారు. ఆయన కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన చిన్న, పెద్ద అందరి హీరోలతో సినిమాలు తీసి హిట్ కొట్టారు.
సురేష్, వినోద్ కుమార్, రాజశేఖర్, చంద్రమోహన్, వెంకటేష్, చిరంజీవి ఇలా అందరితోనూ విజయవంతమైన చిత్రాలను తీసి ఉత్తమ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1980 ప్రాంతంలో సినిమాల్లో ముత్యాల సుబ్బయ్య యాక్టివ్ గా ఉన్నప్పటికీ చిరంజీవితో సినిమా తీయడానికి దాదాపుగా చాలా సమయాన్ని తీసుకున్నారు. 1996 వచ్చేసరికి చిరంజీవితో హిట్లర్ సినిమా తీసే అవకాశం వచ్చింది. ఆయనతో సినిమా తీయడంతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దాదాపుగా అందరి హీరోలతో సినిమా రూపొందించినట్టుగా భావించారు.
అయితే విషయంలోకి వెళితే.. ముత్యాల సుబ్బయ్య సుమన్ తో జయసింహ, మోహన్ బాబుతో మా ఇంటికథ.. ఈ రెండు చిత్రాలు కూడా విజయాన్ని సాధించలేకపోయాయి. ఆ క్రమంలో ఆయన శ్రీరాజ్ చక్రపాణి వారి యువ మాసపత్రికలో వచ్చిన ఓ కథకు బహుమతి వచ్చింది. కొన్ని రోజులకు ఆ కథ నాటకమైంది. ఆ నాటకాన్ని చూసిన దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఆ కథతోనే సినిమా తీయాలనుకున్నారు. సినిమాకు అనుగుణంగా కథకు స్క్రిప్టును రూపొందించుకొని నిర్మాతల ఆఫీస్ వద్దకు వెళ్లారు. ఆసక్తిగా లోపలికి ఆహ్వానించిన నిర్మాతలు కథ వినగానే ఇది ఒక ట్రాజెడీ, ఏడుపుగొట్టు కథ అని… తిరస్కరించారు.
అలా ఎన్నో సార్లు నిర్మాతల చుట్టూ తిరిగి వేసారిపోయిన ముత్యాల సుబ్బయ్య, ఆ కథను సహజనటి జయసుధకు వినిపించారు. అప్పటికే ఆమె జె.ఎస్.కే ప్రొడక్షన్స్ తో సినిమాలను నిర్మిస్తున్నారు. ఆమెకు కథ నచ్చడంతో తన సొంత బ్యానర్ లో నిర్మిస్తానంటూ ముందుకు వచ్చారు. అలాగే కథకు సంబంధించిన ప్రధాన పాత్రలో జయసుధ నటించి విమర్శకుల ప్రశంసలను పొందారు. 1991లో విడుదలైన గ్యాంగ్ లీడర్, అసెంబ్లీ రౌడీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తట్టుకొని.. మధ్యతరగతి కుటుంబాల జీవితాలను ప్రతిబింబిస్తూ వచ్చిన ‘కలికాలం’ చిత్రం వంద రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఈ సినిమాకి గాను ముత్యాల సుబ్బయ్య కళావాహిని పురస్కారాన్ని అందుకున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…