1980 దశకం ప్రారంభంలో.. స్టార్ హీరోలు తమ చిత్రాలతో విజయ దుందుభి మోగించారు. ఎన్టీరామారావు, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోల చిత్రాలను జనాలు నీరాజనాలు పలికారు.
1981లో విడుదలైన ఇద్దరు సీనియర్ హీరోల చిత్రాలు కొంత అలజడిని రేకెత్తించాయి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ తో ఒక సినిమా రూపొందించగా.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఏఎన్నార్ తో ఒక చిత్రం రూపొందించబడింది. ఈ రెండు చిత్రాల విషయంలో ఏది ఇండస్ట్రీ హిట్ అనే సందిగ్ధంలో కొంత అభిమానుల మధ్య వివాదం చోటుచేసుకుంది.
1981 ఫిబ్రవరి, అన్నపూర్ణ బ్యానర్,దాసరి నారాయణరావు దర్శకత్వంలో ప్రేమాభిషేకం చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో ఏఎన్నారు, శ్రీదేవి, జయసుధ హీరో, హీరోయిన్లుగా నటించారు. దాసరి, ఏఎన్ఆర్ కాంబోలో ఇది నాలుగో చిత్రం కాగా అన్నపూర్ణ బ్యానర్ లో ఇది మూడవ చిత్రం. లోగడ కళ్యాణి, బుచ్చిబాబు చిత్రాలు విజయవంతం కాగా… 1980 శ్రీవారి ముచ్చట్లు సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుండగా… దేవదాసు సినిమా కథను పోలి ఉన్న ఒక స్టోరీ లైన్ ని అక్కినేనికి చెప్పడంతో అది నచ్చి తమ సొంత బ్యానర్ లోనే సినిమా తీద్దామని దాసరితో ఆయన చెప్పారు. అలా ముక్కోణపు ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు.
పదహారేళ్ళవయసు, వేటగాడు, ఆటగాడు లాంటి చిత్రాలతో మంచి ఫామ్ లో ఉన్న శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో ఉన్న వేశ్య పాత్రకు ముందుగా లక్ష్మిని అనుకున్నప్పటికీ ఎందుకో ఆమె స్థానంలో జయసుధను తీసుకున్నారు. ప్రేమాభిషేకం చిత్రం తర్వాత అనేక ప్రేమకథా చిత్రాలకు ఈ సినిమా ఒక ప్రేరణ గా చెప్పవచ్చు…
అడవి రాముడు చిత్రంతో ప్రారంభమైన రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్ కాంబో.. ఆ తర్వాత వేటగాడు, డ్రైవర్ రాముడు, కేడి నెంబర్1, గజదొంగ.. లాంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకువెళ్తున్న ఈ కాంబినేషన్ లో మరొక చిత్రం అనగానే అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. అర్జున్ రాజు, శివరామరాజు ఎన్టీఆర్ తో ఒక సినిమా రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో ఆయన డేట్స్ ఇవ్వడంతో సత్యానంద్ ఒక కథ తయారు చేయమని చెప్పారు.
తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా “తంగపథక” చిత్రం తెలుగులోకి ‘బంగారు పతకం’ డబ్ కాబడింది. ఆ సినిమాలోని మూలకథను తీసుకొని పోలీస్ బ్యాక్ డ్రాప్ లో… రచయిత సత్యానంద్ ఒక సెంటిమెంటు కథను తయారు చేశారు. అది ఎన్టీ రామారావుకు నచ్చడంతో.. ఎన్టీఆర్, శ్రీదేవి కాంబోలో వచ్చిన అన్ని చిత్రాలు హిట్ కావడంతో తిరిగి “కొండవీటి సింహం” చిత్రంలో కూడా హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకున్నారు. చక్రవర్తి స్వరపరిచిన గీతాలు ‘అత్తమడుగు వాగులోనా అత్త కూతురో.. ‘బంగినపల్లి మామిడి పండి రంగు మీదుంది.. ఇలాంటి పాటలు ఆనాటి అభిమానులను కిర్రెక్కించాయి.
1981, అక్టోబర్ లో విడుదలైన కొండవీటి సింహం, ప్రేమాభిషేకం చిత్రాలలో ఏది ఇండస్ట్రీహిట్ అనే విషయంలో రెండు చిత్రాల మధ్య కొంత వివాదం రాజుకుంది. ప్రేమాభిషేకం తెలుగు సినీ చరిత్రలో మొదటి ప్లాటినం జూబ్లీ జరుపుకున్న చిత్రం. 30 కేంద్రాల్లో డైరెక్ట్ గా వంద రోజులు, 20 కేంద్రాల్లో 200 రోజులు, 11కేంద్రాలలో 300 రోజులు, 8 కేంద్రాలలో సంవత్సరం పాటు ఆడిన చిత్రమని ఏఎన్ఆర్ అభిమానులు లెక్కలతో సహా నిరూపించడంతో… 1981 సంవత్సరానికి ‘ప్రేమాభిషేకం’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలువుగా.. ఆ సినిమాకి సమీపంలో ‘కొండవీటిసింహం’ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…