ఆరాధన, ఆత్మబలం, అక్కచెల్లెలు, దసరాబుల్లోడు లాంటి చిత్రాల పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే బ్యానర్ జగపతి ఆర్ట్ పిక్చర్స్. ఈ బ్యానర్ అధినేత అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ ఏఎన్నార్ తో అనేక చిత్రాలను రూపొందించారు. ఆ క్రమంలో మద్రాస్ లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్న జగపతిబాబు సినిమాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. జగపతిబాబు తన విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం వైజాగ్ వెళ్లి వ్యాపారం చేసుకోవడం ప్రారంభించారు. అలాకొద్ది రోజుల అనంతరం తన తండ్రిగారికి తెలియకుండా సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ విషయం మధ్యవర్తి ద్వారా తెలుసుకొని వి.బి.రాజేంద్రప్రసాద్ జగపతిబాబు హీరోగా ఓచిత్రం తీయాలనుకున్నారు.
1989, జగపతి ఆర్ట్ పిక్చర్స్, మధుసూదన్ రావు దర్శకత్వంలో ‘సింహస్వప్నం’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో జగపతి బాబు, వాణి విశ్వనాథ్, శాంతిప్రియ హీరో, హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు తన మొదటి చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక ప్రధాన పాత్రలో కనిపించారు.
తర్వాత 1989,పల్లవిపూర్ణ పిక్చర్, పి.అనిల్ దర్శకత్వంలో ‘అడవిలో అభిమన్యుడు’చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో జగపతి బాబు, వినోద్ కుమార్, ఐశ్వర్య కలిసి నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం సగానికిపైగా అడవి నేపథ్యంలో కొనసాగుతోంది. అయితే సినిమా చిత్రీకరణలో భాగంగా హీరో జగపతిబాబు కొండలు, గుట్టలు ఎక్కడం నీళ్ళలో ఈదటం లాంటి కొన్ని కష్టమైన సీన్స్ లలో నటించాల్సివచ్చింది. అడవి నేపథ్యంలో వచ్చిన చిత్రం కాబట్టి సహజంగా అడవుల్లో చెట్లు, ముళ్ళ పొదలు ఉండడం, జనసంచారానికి అవకాశం ఉండక పోవడం లాంటి కారణాలతో షూటింగ్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉండేది
ఆ క్రమంలో జగపతి బాబు తండ్రి గారైన వి.బి.రాజేంద్రప్రసాద్ అడవిలో అభిమన్యుడు చిత్రీకరణ సమయంలో జగపతి బాబు కష్టాన్ని చూసి రోజు ఒక ‘హాఫ్ బాటిల్’ మందుని జగపతిబాబుకు పంపేవారని ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు చెప్పుకొచ్చారు. అలాగే ‘అంతపురం’ చిత్రంలో సారాయి వీర్రాజు పాత్రలో జగపతిబాబు నటించారు. ఆ సినిమాలో జగపతిబాబు చాలా యాంగ్రీగా, ఎమోషనల్ గా కనబడతారు. ఆ షూటింగ్ లో జగపతి బాబు ఆల్కహాల్ తీసుకొని ఓ సన్నివేశంలో నటించానని అదే ఇంటర్వ్యూలో ఆయన కొసమెరుపుగా చెప్పుకొచ్చారు.
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…
ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులు, అసమతుల్య ఆహారం, ఒత్తిడి కారణంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య…
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…