నాగార్జున హీరోగా,మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గీతాంజలి సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ పాత్రలో గిరిజ నటించారు.ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ అయినా రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది.
గీతాంజలి అద్భుతమైన విజయం అందుకోవడంతో గిరిజ ఆ తరువాత మోహన్ లాల్ తో కలిసి రెండు సినిమాలు చేశారు.’వందనం’, ‘ధనుష్కోడి’లో నటించారు. అయితే ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధనుష్కోడి’ చిత్రం పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అదేవిధంగా అమీర్ ఖాన్ సరసన ‘జో జీతా వోహి సికిందర్’ సినిమాలో కొన్ని సన్నివేశాలలో నటించినప్పటికీ ఆ తర్వాత ఈమె స్థానంలో మరో హీరోయిన్ వచ్చారు.
ఈమెకు గీతాంజలి సినిమా అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెట్టింది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని అన్నింటినీ తిరస్కరిస్తూ తెలుగులో హృదయాంజలి అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఓ సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం ఏంటని ప్రశ్నించగా అందుకు ఆమె తమదైన శైలిలో సమాధానం తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
నాకు స్టార్ హీరోలు దర్శకనిర్మాతలు ముఖ్యం కాదు కథ ముఖ్యం. నా వద్దకు వచ్చిన ప్రొడ్యూసర్లు అందరూ ఈ హీరోకి కాల్షీట్లు ఇవ్వండి ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఇంత, అడ్వాన్స్ తీసుకోండి అని చెప్పారే తప్ప.. ఎవరూ కూడా కథ ఇదని వివరించలేదు. నటిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం సినిమాల్లో నటించాలనుకున్నాను కానీ డబ్బు కోసం ఒక ఆట బొమ్మలా సినిమాలో నటించడం అంటే నాకు నచ్చలేదు.అందుకోసమే పెద్ద పెద్ద నిర్మాతలు తన దగ్గరికి వచ్చినప్పటికీ వారిని ఎంతో సున్నితంగా తిరస్కరించాను. ఈ క్రమంలోనే తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు వస్తే తప్పకుండా సినిమాలలో నటిస్తానని వెల్లడించి అలా గిరిజ ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పవచ్చు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…