నాగార్జున హీరోగా,మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గీతాంజలి సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ పాత్రలో గిరిజ నటించారు.ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ అయినా రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది.
గీతాంజలి అద్భుతమైన విజయం అందుకోవడంతో గిరిజ ఆ తరువాత మోహన్ లాల్ తో కలిసి రెండు సినిమాలు చేశారు.’వందనం’, ‘ధనుష్కోడి’లో నటించారు. అయితే ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధనుష్కోడి’ చిత్రం పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అదేవిధంగా అమీర్ ఖాన్ సరసన ‘జో జీతా వోహి సికిందర్’ సినిమాలో కొన్ని సన్నివేశాలలో నటించినప్పటికీ ఆ తర్వాత ఈమె స్థానంలో మరో హీరోయిన్ వచ్చారు.
ఈమెకు గీతాంజలి సినిమా అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెట్టింది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని అన్నింటినీ తిరస్కరిస్తూ తెలుగులో హృదయాంజలి అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఓ సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం ఏంటని ప్రశ్నించగా అందుకు ఆమె తమదైన శైలిలో సమాధానం తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
నాకు స్టార్ హీరోలు దర్శకనిర్మాతలు ముఖ్యం కాదు కథ ముఖ్యం. నా వద్దకు వచ్చిన ప్రొడ్యూసర్లు అందరూ ఈ హీరోకి కాల్షీట్లు ఇవ్వండి ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఇంత, అడ్వాన్స్ తీసుకోండి అని చెప్పారే తప్ప.. ఎవరూ కూడా కథ ఇదని వివరించలేదు. నటిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం సినిమాల్లో నటించాలనుకున్నాను కానీ డబ్బు కోసం ఒక ఆట బొమ్మలా సినిమాలో నటించడం అంటే నాకు నచ్చలేదు.అందుకోసమే పెద్ద పెద్ద నిర్మాతలు తన దగ్గరికి వచ్చినప్పటికీ వారిని ఎంతో సున్నితంగా తిరస్కరించాను. ఈ క్రమంలోనే తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు వస్తే తప్పకుండా సినిమాలలో నటిస్తానని వెల్లడించి అలా గిరిజ ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పవచ్చు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…