సాధారణంగా మనకు ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే ఒక గంట సమయాన్ని గోల్డెన్ అవర్స్ అంటారు. ఈ సమయంలో సరైన చికిత్స అందిస్తే ఆ ప్రమాదం నుంచి ఎవరైనా కూడా బయటపడతారు. మరి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కుకూడా గోల్డెన్ అవర్స్ లో ఉండడం వల్లే ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే సరైన సమయానికి ఆసుపత్రికి తరలించడం వల్లే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు వెల్లడించారు. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే అతనిని చూసింది ఎవరు? ప్రమాదం జరిగినప్పుడు సాయి ధరమ్ తేజ్.. ఏలాంటి పరిస్థితులలోకి వెళ్ళారు అనే విషయాన్ని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కెబుల్ బ్రిడ్జీ మీదుగా ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే కెబుల్ బ్రిడ్జ్ మీదుగా హైటెక్ సిటీ మార్గం గుండా బైక్పై వెళ్తున్న అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే అక్కడికి చేరుకొని సాయి ధరంతేజ్ ను లేపి అతని మొహం పై నీళ్లు కొట్టినట్లు తెలిపారు.
అప్పటికే సాయిధరమ్ తేజ అపస్మారక స్థితిలోకి వెళ్లారనీ, ఆయనకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండటంతో వెంటనే 100 కి 108 కి ఫోన్ చేశానని తెలిపారు. అంబులెన్స్ కు ఫోన్ చేసి పది నిమిషాల్లో అక్కడికి చేరుకోవడం ఆ తరువాత అతనిని దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్ ఫిట్స్ రావడంతో వైద్యులు వెంటనే అతనికి చికిత్స చేయడంతో అతనికి పెద్ద ప్రమాదం తప్పిందని తెలియజేశారు.
ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ అప్పటివరకు తన హీరో అనే విషయం కూడా తెలియదని తెలియజేశారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవడానికి గల కారణం రోడ్డు పై బురద ఉండడం చేత స్కిడ్ అయ్యి కింద పడ్డారని అబ్దుల్ తెలిపారు. అతడు హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ హెల్మెట్ ఒక చోట బండి ఒక చోట పడిపోయిందని ప్రత్యక్షసాక్షి అబ్దుల్ ఫర్హాన్ తెలిపారు. అబ్దుల్ ఫర్హాన్ నిజాంపేట్ క్రాస్ రోడ్డులో కొత్తగా ప్రారంభమైన సిఎంఆర్ షాపింగ్ మాల్ లో వాలెట్ పార్కింగ్ చేస్తుంటారని తెలిపారు. ఈ విధంగా ఒక హీరోని ప్రమాదం నుంచి పాడిన రియల్ హీరో అబ్దుల్ ఫర్హాన్ పై మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…
తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…