Movie News

సాయి ధరమ్ కేసులో బయటపడిన నిజానిజాలు ఇవే..!

మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి కెబుల్‌ బ్రిడ్జీ మీదుగా ఐకియా వైపు స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్ ను వెంటనే స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసిన పోలీసులు అతనిని మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇకపోతే సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో భాగంగా పలు విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది.

సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ రికార్డు పరిశీలించినట్లయితే సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి పై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన సమయానికి సాయి ధరమ్ తేజ్ 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారని తెలియజేశారు.

సాధారణంగా కేబుల్ బ్రిడ్జి పై కేవలం గంటకు 40 కిలోమీటర్ల వేగం అనుమతి కాగా సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ప్రాంతంలో కేవలం 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక సాయి ధరమ్ తేజ్ నడిపిన ట్రైంఫ్ కంపెనీ రేసింగ్ బండి తన పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదని, ఎల్బీ నగర్ కు చెందిన బూర అనిల్ కుమార్ అనే వ్యక్తి దగ్గరసాయి ధరమ్ తేజ్ కొన్నప్పటికీ ఇప్పటివరకు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఇప్పటికే ఆ బైక్ అనిల్ కుమార్ పేరు పై ఉంది.

ఇదే బండి నెంబర్ పై గత ఏడాది అధిక వేగంతో ప్రయాణం చేస్తున్నందుకుగాను రూ. 1135 చలానా పెండింగ్ లో ఉంది. అయితే సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ చలానా కట్టినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను విచారించగా కేవలం అతివేగం కారణంగానే యాక్సిడెంట్ జరిగిందనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

24 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago