Movie News

సాయి ధరమ్ కేసులో బయటపడిన నిజానిజాలు ఇవే..!

మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి కెబుల్‌ బ్రిడ్జీ మీదుగా ఐకియా వైపు స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్ ను వెంటనే స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసిన పోలీసులు అతనిని మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇకపోతే సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో భాగంగా పలు విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది.

సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ రికార్డు పరిశీలించినట్లయితే సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి పై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన సమయానికి సాయి ధరమ్ తేజ్ 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారని తెలియజేశారు.

సాధారణంగా కేబుల్ బ్రిడ్జి పై కేవలం గంటకు 40 కిలోమీటర్ల వేగం అనుమతి కాగా సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ప్రాంతంలో కేవలం 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక సాయి ధరమ్ తేజ్ నడిపిన ట్రైంఫ్ కంపెనీ రేసింగ్ బండి తన పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదని, ఎల్బీ నగర్ కు చెందిన బూర అనిల్ కుమార్ అనే వ్యక్తి దగ్గరసాయి ధరమ్ తేజ్ కొన్నప్పటికీ ఇప్పటివరకు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఇప్పటికే ఆ బైక్ అనిల్ కుమార్ పేరు పై ఉంది.

ఇదే బండి నెంబర్ పై గత ఏడాది అధిక వేగంతో ప్రయాణం చేస్తున్నందుకుగాను రూ. 1135 చలానా పెండింగ్ లో ఉంది. అయితే సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ చలానా కట్టినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను విచారించగా కేవలం అతివేగం కారణంగానే యాక్సిడెంట్ జరిగిందనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago