సాంఘిక చిత్రాల్లో కరుణరస పాత్రలకు పెట్టింది పేరు అక్కినేని నాగేశ్వరావని చెప్పుకోవచ్చు. 1960 దశకంలో బెంగాలీ నవలల ఆధారంగా కొన్ని తెలుగు సినిమాలు రావడం జరిగింది. సాధారణంగా తెలుగులో వచ్చిన పౌరాణిక చిత్రాలను బెంగాలీ వారు చూడటం, బెంగాలీ లో వచ్చిన సాంఘిక చిత్రాలను తెలుగువారు చూడటం అలవాటుగా ఉండేది.
ఎందుకంటే అంత భారీ మొత్తంలో పౌరాణిక చిత్రాలపై ఖర్చుపెట్టి రూపొందించడం కష్టం కనుక తెలుగునుంచి వచ్చిన పౌరాణిక చిత్రాలను బెంగాల్ లో ప్రదర్శించడం జరిగేది. ఆ విధంగా 1960లో దుక్కిపాటి మధుసూదనరావు కలకత్తా వెళ్లి అక్కడ ద్విపాత్రాభినయంతో ప్రదర్శిస్తున్న ఓ బెంగాలీ చిత్రాన్ని చూడటం జరిగింది.
ఇలాంటి ద్విపాత్రాభినయంతో తెలుగులో సినిమా తీస్తే బాగుంటుందని ఆయన బెంగాలీ చిత్రంలోని ద్విపాత్రాభినయంతో కూడిన సందర్భాన్ని తీసుకున్నారు కాని మళ్ళీ తెలుగులో కొత్తగా కథను రాసుకుని ఆ కథను నాగేశ్వరరావుకి వినిపించడంతో ఆయన సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలా 1961, అన్నపూర్ణ బ్యానర్, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, సరోజ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.
ఈ సినిమా విడుదలైన చాలా సంవత్సరాలకు.. చిరంజీవి కె.రాఘవేంద్రరావు, కాంబినేషన్ ‘మోసగాడు’ చిత్రంతో ప్రారంభమై తిరుగులేని మనిషి, కొండవీటి రాజా, అడవి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి, ముగ్గురు మొనగాళ్ళు, ఇద్దరుమిత్రులు, యుద్ధ భూమి, రుద్ర నేత్ర, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిట్టచివరి చిత్రం ‘శ్రీ మంజునాథ’ వరకు వీరి కాంబినేషన్ లో పరాజయాలు ఉన్నప్పటికీ, ఎక్కువగా విజయవంతమైన సినిమాలే తీశారు. అలా 1999, చంటి అడ్డాల నిర్మాణం, రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం విడుదలైంది.
ఈ సినిమాలో చిరంజీవి, రమ్యకృష్ణ, సాక్షి శివానంద్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి సాక్షి శివానంద్ కలిసి నటించిన దృశ్యాలన్నీ “కుచ్ కుచ్ హోతా హై” చిత్రంలోని షారుక్, కాజల్ మధ్య వచ్చే సీన్స్ ను పోలి ఉంటాయి. అయితే సాక్షి శివానంద్, చిరంజీవితో రెండోసారి ఈ చిత్రంలో కలిసి నటించారు. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రేంజ్ కు తగిన విధంగా ‘ఇద్దరు మిత్రులు’ సినిమా ఆడక పోయినా జస్ట్ హిట్ గా మాత్రం నిలిచిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25ను ప్రపంచ మలేరియా దినోత్సవంగా పాటిస్తారు. దోమల ద్వారా వ్యాపించే ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన…
శనివారం రోజు హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించేందుకు ఈ రోజు…
ఉదయం లేవగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది టీ లేదా కాఫీ. బెడ్ టీ లేకుండా రోజు మొదలవదనే అలవాటు చాలా…
అకస్మాత్తుగా ఎవరో స్పృహ కోల్పోతే చాలామంది వెంటనే చేసే పని వారి ముఖంపై నీళ్లు చల్లడం లేదా నీరు తాగించడానికి…
ఉప్పు లేకుండా ఆహారం పూర్తవదు. ప్రతి ఇంట్లో రోజూ వాడే ముఖ్య పదార్థాల్లో ఉప్పు ఒకటి. కానీ దీని వినియోగం…
ఈ రోజుల్లో అధిక రక్తపోటు (హై బీపీ) సమస్య చాలా సాధారణంగా మారుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో కూడా…