విజయ వాహినీ స్టూడియో అధినేతల్లో ఒకరైన బి.నాగిరెడ్డి అంటే తెలియని ఆనాటి నటులు ఎవరూ ఉండరు.వారు నాటిన విజయ వాహిని అనే చెట్టు నీడలో అనేక ఉత్తర, దక్షిణాది సినిమాలు చిత్రీకరణ జరిగాయి.అలా అనేక సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి.ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ చిత్రాలను కూడా విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించడం జరిగింది.
చక్రపాణి మరణించిన తర్వాత బి.నాగిరెడ్డి హీరో సంజీవ్ కుమార్ తో నిర్మించిన యెహీ హై జిందగీ హిందీ చిత్ర నిర్మాణ క్రమంలో తన కొడుకు బి.ఎల్.ఎన్. ప్రసాద్ కూడా జోక్యం చేసుకొనేవాడు. ఈ సినిమా తరవాత సంజీవ్ కుమార్ తో స్వయంవర్ అనే మరో హిందీ చిత్రం నిర్మించిన అనంతరం విశ్రాంతి కోసం కొడైకెనాల్ వెళ్ళినప్పుడు బి.నాగిరెడ్డి పెద్దకొడుకు బి.ఎల్.ఎన్ ప్రసాద్ గుండెపోటుతో మరణించాడు.
ఈ సమయంలోనే ఏ.వి.ఎమ్ బ్యానర్ లో శరవణన్, సుబ్రహ్మణ్యన్ నిర్మాణంలో రాజశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘పున్నమినాగు’ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఆ తర్వాత సెన్సార్ బోర్డు వారు ఆ సినిమాని రివైజింగ్ కమిటీకి పంపించారు.
రివైజ్ కమిటీ సభ్యుల్లో ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో తన కొడుకు చనిపోయి నాలుగైదు రోజులు మాత్రమే అయినా పుట్టెడు దుఃఖంలో కూడా బి.నాగిరెడ్డి స్పందించి సినిమా ఆగిపోతే నిర్మాతకు లక్షల్లో నష్టం జరుగుతుందని రివైజింగ్ కమిటీకి హాజరై ఆ సినిమా విడుదలకి సహకరించారు. 1980 జూన్ 13న ‘పున్నమినాగు’ విడుదలై సూపర్ హిట్ అయింది.
హిందూ దేవాలయ నిర్మాణంలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యమైనది ధ్వజస్తంభం ఏర్పాటు. ఏ ఆలయానికి…
జ్యోతిష్య విశ్వాసాల్లో శని Dev ప్రత్యేక స్థానం కలిగిన దేవతగా భావిస్తారు. కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవుడిగా ఆయనను…
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ స్థానం కలిగిన Srisailam Temple క్షేత్రానికి భక్తుల రాకపోకలు ఎప్పుడూ కొనసాగుతూనే…
తలనొప్పి అనగానే చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఒక వైపున గుచ్చినట్లుగా తీవ్రంగా వచ్చే నొప్పి, దానికి తోడు…
వేసవికాలం మొదలైనప్పుడల్లా శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల కోసం చాలా మంది వెతుకుతుంటారు. బయట దొరికే కూల్డ్రింక్స్ తాత్కాలికంగా చల్లదనం…
తెలుగు వంటల్లో పాతకాలపు రుచులకు ప్రత్యేక స్థానం ఉంది. కాలం మారుతున్న కొద్దీ కొత్త రకాల ఫుడ్ అలవాట్లు పెరిగినా,…