విజయ వాహినీ స్టూడియో అధినేతల్లో ఒకరైన బి.నాగిరెడ్డి అంటే తెలియని ఆనాటి నటులు ఎవరూ ఉండరు.వారు నాటిన విజయ వాహిని అనే చెట్టు నీడలో అనేక ఉత్తర, దక్షిణాది సినిమాలు చిత్రీకరణ జరిగాయి.అలా అనేక సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి.ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ చిత్రాలను కూడా విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించడం జరిగింది.
చక్రపాణి మరణించిన తర్వాత బి.నాగిరెడ్డి హీరో సంజీవ్ కుమార్ తో నిర్మించిన యెహీ హై జిందగీ హిందీ చిత్ర నిర్మాణ క్రమంలో తన కొడుకు బి.ఎల్.ఎన్. ప్రసాద్ కూడా జోక్యం చేసుకొనేవాడు. ఈ సినిమా తరవాత సంజీవ్ కుమార్ తో స్వయంవర్ అనే మరో హిందీ చిత్రం నిర్మించిన అనంతరం విశ్రాంతి కోసం కొడైకెనాల్ వెళ్ళినప్పుడు బి.నాగిరెడ్డి పెద్దకొడుకు బి.ఎల్.ఎన్ ప్రసాద్ గుండెపోటుతో మరణించాడు.
ఈ సమయంలోనే ఏ.వి.ఎమ్ బ్యానర్ లో శరవణన్, సుబ్రహ్మణ్యన్ నిర్మాణంలో రాజశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘పున్నమినాగు’ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఆ తర్వాత సెన్సార్ బోర్డు వారు ఆ సినిమాని రివైజింగ్ కమిటీకి పంపించారు.
రివైజ్ కమిటీ సభ్యుల్లో ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో తన కొడుకు చనిపోయి నాలుగైదు రోజులు మాత్రమే అయినా పుట్టెడు దుఃఖంలో కూడా బి.నాగిరెడ్డి స్పందించి సినిమా ఆగిపోతే నిర్మాతకు లక్షల్లో నష్టం జరుగుతుందని రివైజింగ్ కమిటీకి హాజరై ఆ సినిమా విడుదలకి సహకరించారు. 1980 జూన్ 13న ‘పున్నమినాగు’ విడుదలై సూపర్ హిట్ అయింది.
తలనొప్పి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సాధారణ సమస్య. పని ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, ఆకలి,…
ఫుడ్ కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. ‘హెల్తీ’, ‘ఆర్గానిక్’ పేర్లతో వినియోగదారులను మభ్యపెడుతున్నారా? ఈ రోజుల్లో మార్కెట్లో అడుగుపెడితే ప్రతి రెండో…
తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనం వింటూ ఉంటాం. అయితే గర్భంలో ఉన్న బిడ్డ…
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన రాజకీయ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. దేశ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం ప్రజలు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఒకటి రాత్రి భోజనం మానేయడం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న…
పెళ్లి అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ముఖ్యంగా మహిళలకు పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా కొత్త…