విజయ వాహినీ స్టూడియో అధినేతల్లో ఒకరైన బి.నాగిరెడ్డి అంటే తెలియని ఆనాటి నటులు ఎవరూ ఉండరు.వారు నాటిన విజయ వాహిని అనే చెట్టు నీడలో అనేక ఉత్తర, దక్షిణాది సినిమాలు చిత్రీకరణ జరిగాయి.అలా అనేక సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి.ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ చిత్రాలను కూడా విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించడం జరిగింది.
చక్రపాణి మరణించిన తర్వాత బి.నాగిరెడ్డి హీరో సంజీవ్ కుమార్ తో నిర్మించిన యెహీ హై జిందగీ హిందీ చిత్ర నిర్మాణ క్రమంలో తన కొడుకు బి.ఎల్.ఎన్. ప్రసాద్ కూడా జోక్యం చేసుకొనేవాడు. ఈ సినిమా తరవాత సంజీవ్ కుమార్ తో స్వయంవర్ అనే మరో హిందీ చిత్రం నిర్మించిన అనంతరం విశ్రాంతి కోసం కొడైకెనాల్ వెళ్ళినప్పుడు బి.నాగిరెడ్డి పెద్దకొడుకు బి.ఎల్.ఎన్ ప్రసాద్ గుండెపోటుతో మరణించాడు.
ఈ సమయంలోనే ఏ.వి.ఎమ్ బ్యానర్ లో శరవణన్, సుబ్రహ్మణ్యన్ నిర్మాణంలో రాజశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘పున్నమినాగు’ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఆ తర్వాత సెన్సార్ బోర్డు వారు ఆ సినిమాని రివైజింగ్ కమిటీకి పంపించారు.
రివైజ్ కమిటీ సభ్యుల్లో ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో తన కొడుకు చనిపోయి నాలుగైదు రోజులు మాత్రమే అయినా పుట్టెడు దుఃఖంలో కూడా బి.నాగిరెడ్డి స్పందించి సినిమా ఆగిపోతే నిర్మాతకు లక్షల్లో నష్టం జరుగుతుందని రివైజింగ్ కమిటీకి హాజరై ఆ సినిమా విడుదలకి సహకరించారు. 1980 జూన్ 13న ‘పున్నమినాగు’ విడుదలై సూపర్ హిట్ అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…