సినిమా రంగం విచిత్రమైనది.ఏ సినిమా విజయవంతం అవుతుందో ఏ సినిమా పరాజయం పొందుతుందో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లు కొంతమంది దర్శక నిర్మాతలు కథ విన్న వెంటనే సినిమా సక్సెస్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ కొన్నిసార్లు ఎక్కడో ఒక దగ్గర తప్పులో కాలేసే పరిస్థితి వస్తుంది.ఇంకొన్నిసార్లు కథ వినగానే ఓహో అనిపిస్తుంది. తీరా సినిమా ఎగ్జిక్యుషన్ లో డ్రాబ్యాక్స్ తో సినిమా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సింపుల్ గా తీసిన సినిమా బ్లాక్ బస్టర్,ఇండస్ట్రీ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి.
అలా ఒక సినిమా ముందే హిట్టు, ఫట్టు అని కచ్చితంగా చెప్పలేమన్నది సినిమారంగం ఎరిగిన సత్యం. దాదాపు 15 సంవత్సరాలు అసోసియేట్, అసిస్టెంట్ డైరెక్టర్ గా సముద్ర పని చేయడం జరిగింది. అలా ఆర్.బి.చౌదరి పరిచయంతో ఆయన సలహాతో తమిళంలో మదర్ సెంటిమెంట్ తో నడుస్తున్న తమిళ ‘మాయి’ చిత్రాన్ని దర్శకుడు సముద్రని చూడమన్నారు. ఆ తమిళ సినిమాను చూసిన సముద్ర తాను ఆర్.బి.చౌదరి నిర్మాణంలో ఒక సినిమా చేస్తానని ఒప్పుకున్నారు. అలా రాజశేఖర్ కి తమిళ సినిమా నచ్చడం దానికి దర్శకుడిగా సముద్రని కూడా అంగీకరించడం జరిగింది.
2001 ఆర్.బి.చౌదరి నిర్మాణం, వి.సముద్ర దర్శకత్వంలో ‘సింహరాశి’ చిత్రం విడుదలైంది. ఇందులో రాజశేఖర్, సాక్షిశివానంద్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అలా దర్శకుడు సముద్ర మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఆ తరువాత రాజశేఖర్ తన చిత్రాలు దర్శకుడు సముద్రతో అనుకున్నప్పటికీ కథ, ఇతర అంశాలు నచ్చకపోవడంతో దాదాపు రాజశేఖర్ నటించిన ఆరు చిత్రాలను సముద్ర రిజెక్ట్ చేయడం జరిగింది.
శేషు, భరతసింహారెడ్డి, ఆయుధం, విలన్, ఆప్తుడు, నాయకుడు లాంటి చిత్రాలు దర్శకత్వం చేసే అవకాశం సముద్రకి వచ్చినప్పటికీ ఆయన వాటిని తిరస్కరించడం జరిగింది. తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం సూపర్ హిట్ అందుకుంది. 2007 కౌశిక్ మూవీస్, సముద్ర దర్శకత్వం వహించిన ‘ఎవడైతే నాకేంటి’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో రాజశేఖర్, సంవృత హీరో, హీరోయిన్ గా నటించారు. తమిళంలో నడుస్తున్న చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఎవడైతే నాకేంటి సినిమాకి పరుచూరి బ్రదర్స్ రచనా సహకారాన్ని అందించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…