కమెడియన్ గా తన కెరియర్ ను మొదలు పెట్టి.. ప్రస్తుతం బడా నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు బండ్ల గణేష్. అయితే అతడు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటున్నాడు. ట్రెండింగ్ లో తన పేరు కూడా ఉండే విధంగా చూసుకుంటున్నాడు. అది వ్యక్తిగత విషయాలపరంగా అయినా, వివాదాస్పద వ్యాఖ్యలతోనైనా, సినిమా విశేషాలపరంగానైనా సరే బండ్ల గణేష్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు.
మొన్నటి వరకు మా ఎన్నికలల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తర్వాత వెంటనే జీవిత రాజశేఖర్ మీద సెటైర్లు వేయడం.. జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతాను అంటూ చేసిన వ్యాఖ్యలతో బండ్ల గణేష్ క్రియేట్ చేసిన వేడి అంతా ఇంతా కాదు. అయితే తాజాగా బండ్ల గణేష్ అందరికీ షాకిచ్చారు. ‘డేగల బాబ్జీ’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… స్వాతి చంద్ర నిర్మిస్తున్న చిత్రంతో ఆయన హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.
ఆ చిత్రానికి డేగాల బాబ్జీ గా టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం హరీశ్ శంకర్ టైటిల్ పోస్టర్ ఆవిష్కరించారు. తమిళంలో హిట్టైన సినిమాను తెలుగులో బండ్ల గణేష్ను హీరోగా పెట్టి రీమేక్ చేస్తున్నారు. అదే సినిమాను హిందీలో అభిషేక్ బచ్చన్ను హీరోగా పెట్టి తీయబోతోన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లతో ఈ ఫస్ట్ లుక్ వైరల్ అవుతోంది.
పోస్టర్ రిలీజ్ అనంతరం.. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. బండ్ల గణేశ్ ఫస్ట్లుక్, టైటిల్కు అద్భుత స్పందన లభిస్తోందని అన్నారు.. సినిమా సైతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని.. ఈ సినిమాను అతి త్వరలో షూటింగ్ ఫినీష్ చేసేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…