గత కొంత కాలంగా నాగచైతన్య, సమంత మధ్య చిన్నపాటి గొడవలతో విడిపోతున్నారన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అవి ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. చైతు మాత్రం తన లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు మాత్రం బాగానే చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజు క్రితం లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల చేసిన చిత్ర బృందం.. సెప్టెంబర్ 19న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు.
తర్వాత వెటనే అంటే సెప్టెంబర్ 24 న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసుందుకు ప్రణాళికతో ఉన్నారు. అయితే ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేందుకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. నాగార్జునకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి పలు ఈవెంట్లకు హాజరయ్యారు చిరంజీవి. మరోసారి నాగచైతన్య హరోగా నటించిన లవ్ స్టోరీ ఫిలిం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రానున్నారు.
ఇదిలా ఉండగా ముందుగా ఈ ఈవెంట్ ను మొదట 17 సెప్టెంబర్ అనుకున్నారట.. కానీ చిరంజీవికి ఆరోజు కుదరకపోవడంతో 19 తేదీకీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో చిరంజీవి, నాగార్జున ఇద్దరు కనిపించబోతున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే సినిమాకు సంగీతం వహించిన పవన్ అద్భుతమైన బాణీలను అందించారు. ఇప్పటికే ఈ పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
నాలుగు పాటలు అయితే ఇప్పటికీ యూట్యూబ్ లో ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటున్నాయి.
ఫిదా లాంటి సూపర్ హిట్ కొట్టిన తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో పాటు మొన్న విడుదలైన ట్రైలర్ కూడా సినిమా మీద ఆసక్తి పెంచేసింది. మరి చూడాలి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…