షూటింగ్ విరామంలో సాయంత్రం పూట ఇంటికి ఫోన్ చేస్తే ఎడిటర్ మోహన్ గారు మీకోసం వచ్చారని చెప్పడంతో.. ఆయన తర్వాత ఎడిటర్ మోహన్ ఇంటికి వెళ్లి కలవడం జరిగింది. అప్పుడు ఎడిటర్ మోహన్ ముత్యాల సుబ్బయ్యను తీసుకెళ్లి మమ్ముట్టి నటించిన ఓ మలయాళం సినిమాని చూపించడం జరిగింది.
అప్పుడు ముత్యాల సుబ్బయ్య సినిమా చాలా బాగుందని చెప్పడంతో ఇది తెలుగులో ఎవరితో తీస్తే బాగుంటుందని అడగగా చిరంజీవి లాంటి స్టార్ తో తీస్తే బాగుంటుందని ముత్యాల సుబ్బయ్య చెప్పారు. సరిగ్గా నేను కూడా చిరంజీవి గారు అయితేనే బాగుంటుందనుకున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఇద్దరూ చిరంజీవిని కలవడం జరిగింది.
అయితే అప్పటికే పవిత్ర బంధం లాంటి కుటుంబ కథా చిత్రాన్ని తీసిన ముత్యాల సుబ్బయ్య సెంటిమెంటుతో ప్రేక్షకుల కన్నీళ్ళకు ఆయింట్మెంట్ రాసే దర్శకుడిగా ఆయనకు మంచి పేరు ఉండటంతో ఎడిటర్ మోహన్ దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య ను ఎంచుకోవడం జరిగింది. అప్పటికి చిరంజీవి, రాధిక నటించిన ‘ఇది పెళ్లంటారా’ అనే సినిమాకి కో-డైరెక్టర్ గా మాత్రమే చేసిన ముత్యాల సుబ్బయ్యకు ఎప్పటినుంచో చిరంజీవితో సినిమా తీయాలనేది కోరికగానే ఉండిపోతుందా.. అనుకునే సమయంలో చిరంజీవితో ‘హిట్లర్’ సినిమా చేసే అవకాశం వచ్చింది.
రిక్షావోడు, బిగ్ బాస్, ఎస్పి.పరశురాం లాంటి పరాజయాలతో చిరంజీవి దాదాపు మూడు సంవత్సరాలు హిట్ సినిమా లేక సతమతమవుతున్న తరుణంలో ముత్యాల సుబ్బయ్య చిరంజీవికి ఓ సూపర్ హిట్ సినిమాను అందించారు. సినిమాలో కేవలం సెంటిమెంట్ మాత్రమే కాకుండా కామెడీ, అంతకుమించి చిరంజీవి ప్రత్యేకమైన పాటలు, డాన్సులు అభిమానులకు ఎడారిలో బిస్లరీ బాటిల్ దొరికినట్టుగా ఫీల్ అయ్యారు. మూడు సంవత్సరాలకు ఓ విజయవంతమైన సినిమాతో చిరంజీవి ఊపిరిపీల్చుకున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…