Featured

అనుష్కను ఫాలో అయిన కీర్తి సురేష్..అందుకే ఫ్లాపులొస్తున్నాయా ..?

టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో అక్కినేని నాగార్జున – సోనుసూద్ నటించిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. సినిమా ఇండస్ట్రీ మీద ఏమాత్రం అవగాహన లేకుండా వచ్చి ఆడిషన్ అంటే, ఫొటో షూట్ అంటే తెలుసుకోకుండా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అడుగుపెట్టింది. మొదటి సినిమాకి గ్లామర్ గా కనిపించాలంటే చాలా నెర్వెస్ గా ఫీలయి ఏడ్చిన సందర్భాలూ ఉన్నాయి. చిన్న చిన్న డ్రెస్‌లు వేసుకొని 400 మంది ముందు నటించాలంటే చాలా ఇబ్బంది పడింది. ఇక మేకప్ టెస్ట్ చేయడానికి మేకప్ మ్యాన్.. అనుష్మ ముఖాన్ని కామెంట్ చేశాడు.

మొదటి సినిమా సూపర్ తర్వాత ఇక సినిమాలు వద్దనుకుంది. ఈ సినిమా తర్వాత తనకి ఇష్టమైన యోగా వృత్తిలోనే కొనసాగాలనుకుంది. కానీ ‘సూపర్’ సూపర్ డూపర్ హిట్ అయి అందరూ తనని మెచ్చుకోవడంతో ఇండస్ట్రీలో కొనసాగాలని డిసైడయింది. అప్పటి నుంచి కథ ఎలాంటిదైనా దానికోసం పూర్తి స్థాయిలో శ్రమించడం తనలో ఉన్న గొప్పతనం. ఒకసారి సినిమాకి కమిటయితే ఎలాంటి ప్రయోగం చేయాలన్నా ఏమాత్రం వెనకాడదు. అందుకే ఆమెకి అరుంధతి వంటి గొప్ప సినిమా చేసే అవకాశం అందుకుంది. ఈ సినిమా అనుష్క క్రేజ్‌ను విపరీతంగా పెంచేసింది.

అరుంధతికి ముందు అరుంధతికి తర్వాత అన్నట్టుగా అనుష్క స్టార్ డం పెరిగింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి చక చకా సైన్ చేసేసి దెబ్బ తినింది. అన్నీ అరుంధతి సినిమాలా సూపర్ హిట్ కావు కదా. కానీ అనుష్క సైజ్ జీరో లాంటి సినిమాలు ఒప్పుకొని కెరీర్ మొత్తం చిక్కుల్లో పడేసుకుంది. దాంతో తనకంటే తర్వాత చచ్చిన వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. కానీ అనుష్క గత చిత్రం నిశ్శబ్ధం తర్వాత మళ్ళీ కొత్త సినిమా ప్రకటించలేదు.  

మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా అసాధారణమైన క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ కూడా ఇప్పుడు అనుష్కని ఫాలో అయిందని అందువల్లే తన కెరీర్ కూడా ఇప్పుడు కాస్త ఇబ్బందుల్లో పడిందని చెప్పుకుంటున్నారు. మహానటి సినిమా కీర్తి సురేష్ కి మైల్ స్టోన్ మూవీ మాత్రమే కాదు. అప్పటి వరకు కమర్షియల్ హీరోయిన్‌గా క్రేజ్ కాస్త మరోస్థాయికి చేరుకుంది. ఈ సినిమా తర్వాత అనుష్క మాదిరిగానే వరుసగా మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కమిటయింది. అంతేకాదు గత ఏడాది కరోనా వల్ల ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ కాలేదు.

కానీ కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ప్రముఖ ఓటీటీలో విడుదలై ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకున్నాయి. ప్రగ్నెంట్ లేడీ పాత్రలో ప్రయోగం చేసింది. చాలా శ్రమపడి ఈ పాత్ర చేసింది. కానీ ప్రేక్షకులని మాత్రం మెప్పించలేకపోయింది. ఆ సినిమానే పెంగ్విన్. ఇక ఆ తర్వాత వచ్చిన మిస్ ఇండియా అయితే మరీ ఘోరమైన టాక్ తెచ్చుకుంది. చాలా చిన్న పాయింట్‌తో మిస్ ఇండియా సినిమా ఎలా తీశారని విమర్శలు వచ్చాయి. అంతేకాదు కీర్తికి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక ఈ సినిమాల కోసం బొద్దుగా ఉన్నది కాస్త సన్నగా పీలగా తయారైంది.

కీర్తిని ఇలా చూడటానికి అభిమానులే అంతగా ఇష్టపడలేదని టాక్ వినిపించింది. ఇక కమర్షియల్ సినిమాగా వచ్చిన రంగ్ దే హిట్ అనే టాక్ మొదటలో వచ్చినా కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. పైగా కాస్త బొద్దుగా అవ్వాలంటూ అభిమానులు సలహాలిచ్చారు. అంతేకాదు సర్కారు వారి పాట సినిమా మొదలయ్యేసరికి కాస్త లావెక్కాలని మేకర్స్ సూచించారట. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ మహేష్ బాబుతో నటిస్తున్న సర్కారు వారి పాట మీదే ఉంది. చూడాలి మరి కీర్తి సురేష్ ఇప్పటి నుంచైనా ఎంచుకునే ప్రాజెక్ట్స్ ఆచితూచి ఎంచుకుందో లేదో.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘బాషా’ తరహా సస్పెన్స్‌తో సమంత ‘మా ఇంటి బంగారం’..రన్‌టైమ్ కూడా ఫిక్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…

23 minutes ago

కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? ఇంట్లోనే ఈ రైస్ మాస్క్ ట్రై చేయండి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్‌కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…

40 minutes ago

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

1 hour ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

1 hour ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

1 hour ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

24 hours ago