దర్శకుడు బి.గోపాల్, బొబ్బిలిరాజా, లారీడ్రైవర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరో మోహన్ బాబు “అల్లుడుగారు” సినిమా విజయంతో మంచి స్వింగ్ లో ఉన్నారు. తమిళంలో విజయవంతమైన చిత్రాన్ని చూసిన మోహన్ బాబు ఆ సినిమాను తెలుగులో తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. ముందుగా దర్శకుడు బి.గోపాల్ కి ఆ వీడియో క్యాసెట్ ని చూపించారు. ఎందుకైనా మంచిది ఈ సినిమాని రచయితలు పరుచూరి బ్రదర్స్ కి చూపించమని మోహన్ బాబుకి చెప్పారు. వారికి నచ్చకపోతే ఈ సినిమా చేయరా.. మీరు అని మోహన్ బాబు బి.గోపాల్ ని అడిగారు. అలా కాదు ఒకసారి పరుచూరి బ్రదర్స్ కి చూపిస్తే బాగుంటుందని బి.గోపాల్ చెప్పారు.
పరుచూరి బ్రదర్స్ కి ఫోన్ చేస్తే ఎక్కడో షూటింగ్ లొకేషన్స్ లో ఉన్నారని చెప్పారు. ఆ తరువాత చెన్నై రావడంతో తమిళ ఒరిజినల్ సినిమాని మోహన్ బాబు పరుచూరి బ్రదర్స్ కి చూపించారు. సినిమా బాగుంది కానీ కొన్ని మార్పులు చేర్పులు చేయాలని పరుచూరి గోపాలకృష్ణ చెప్పడంతో… మద్రాస్ టీనగర్, త్రిమూర్తి స్ట్రీట్ లో ఏ మాత్రం వాస్తు లేని ఓ పాత బంగ్లాను అద్దెకు తీసుకున్నారు. ఒక “అల్లుడు గారు” తప్ప మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ లతో ఉన్నాయి.. అలాంటప్పుడు ఏమాత్రము వాస్తుకులేని ఓ పాత బంగ్లాను అద్దెకు తీసుకుంటున్నావు.. అని చెప్పినా కూడా మోహన్ బాబు అదే బంగ్లాలో ఒరిజినల్ తమిళ సినిమా కథను మార్పులు చేర్పులతో తిరిగి రాసుకోవడం జరిగింది. ఆ సినిమానే “అసెంబ్లీ రౌడీ”.
అలా కథ స్క్రీన్ ప్లే, సంభాషణలు వ్రాసుకున్న అనంతరం సినిమాకి సంబంధించిన నటవర్గం ఎంపిక ప్రక్రియ మొదలయ్యింది. మోహన్ బాబు కు జోడిగా ఎవరైతే బాగుంటుందనుకుంటున్న సందర్భంలో.. పరుచూరి బ్రదర్స్ దివ్యభారతిని పెట్టుకోమని సలహా ఇచ్చారు. అలా దివ్యభారతి సినిమాకి హీరోయిన్ గా ఎంపికైంది. మోహన్ బాబు కు తండ్రిగా ముందుగా రావుగోపాల్ రావును అనుకున్నప్పటికీ.. ఆయన నా వయసు మీద పడడంతో షూటింగుకి రావడం ఆలస్యం అవుతానని చెప్పడంతో.. ఆయన స్థానంలో కళావాచస్పతి జగ్గయ్యను తీసుకున్నారు. ఆ తర్వాత ఒకప్పుడు ఆయనతో హీరోయిన్ గా నటించిన అన్నపూర్ణను మోహన్ బాబుకి తల్లి పాత్రను చేయించడం జరిగింది.
చిత్తూరు జిల్లా, తిరుపతికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాలలో 41 రోజులు సినిమా షూటింగ్ చేశారు. షూటింగ్ ఉదయం 6 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగించేవారు. తర్వాత నటీనటులకు బ్రేక్ ఇచ్చి తిరిగి సాయంత్రం 6 గంటల వరకు కు సినిమా షూటింగ్ జరిపారు. ఇక ఈ అసెంబ్లీ రౌడీ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించారు. ఇందులోని పాటలు ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు హైదరాబాదులో నిర్వహించారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…