నందమూరి అభిమానులు తమ అభిమాన నటుడు బాలకృష్ణ సినిమాకోసం ఎదురుచూస్తున్న సమయంలో శ్రీనివాస ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో బాలకృష్ణ సహ నిర్మాతగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ వ్యయంతో నిప్పురవ్వ సినిమా 1991 సెప్టెంబర్ 11న మద్రాసులోని ఏ.వి.ఎమ్ స్టూడియోలో ప్రారంభోత్సవానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇద్దరు హాజరయ్యారు. అయితే ఇందులో బాలకృష్ణ బొగ్గుగని కార్మికుల ప్రతినిధిగా నటించారు. బాలకృష్ణ, విజయశాంతి నటించే సీన్ కు మోహన్ లాల్ కెమెరా స్విచాన్ చేయగా, రజినీకాంత్ క్లాప్ కొట్టడం జరిగింది.
నిర్మాత దేవి వరప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. నిప్పురవ్వ సినిమాలో పోలీస్ పాత్ర లో అలనాటి నటి లక్ష్మి కనిపించగా, బాలకృష్ణ సరసన విజయశాంతి నటించారు. కానీ పోలీస్ పాత్ర కు విజయశాంతిని, బాలకృష్ణ సరసన దివ్యభారతిని ఎంపిక చేద్దామనుకున్నారు. ఆ క్రమంలో దివ్యభారతి గల డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవడంతో.. బాలకృష్ణకు జోడీగా విజయశాంతిని, పోలీస్ పాత్రకు లక్ష్మిని తీసుకొని కథను కాస్త మార్చారు. ఈ సినిమాకు బప్పిలహరి సంగీతాన్ని అందించగా, రండి రండి రండి అనే ఒక్క పాటను వేటూరి రాయగా, రాజ్ కోటి స్వరపరిచారు. ఈ సినిమాలోని డ్యూయెట్ సాంగ్ లను భారీ వ్యయంతో చిత్రీకరించారు. ఇందులోని ఒక పాట కోసం అప్పట్లో నే ఆస్ట్రీయా వెళ్లి చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాలోని పతాక సన్నివేశాలు ఎంతో ఖర్చు చేసి చిత్రీకరించడం జరిగింది. ఆంధ్రా అటవీ ప్రాంతంలో సినిమా షూటింగ్ కి అనుమతి లేకపోవడంతో ముంబాయి ఫారెస్ట్ ఏరియాలో నిప్పురవ్వ సినిమా చిత్రీకరించడం జరిగింది. మొదటి భాగం రషెస్ చూసి దానిలోని లోపాలను మార్చారు.
నిప్పురవ్వ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా తమిళంలో వైజయంతి ఐపీఎస్ పేరుతో విడుదలయ్యింది. ఆ సినిమాలో విజయశాంతి మాస్ ఇమేజ్ తో కనిపించారు. నిప్పురవ్వ సినిమాలో ఎలుగుబంటిని చూసి విజయశాంతి భయపడుతుంది.. అప్పటికీ ఆమె ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా క్లైమాక్స్ లో బాలకృష్ణ కు ధీటుగా కొన్ని ఫైట్స్ విజయశాంతితో చేయించడం జరిగింది. అయితే ఎలుగుబంటిని చూసి భయపడిన విజయశాంతి సినిమా క్లైమాక్స్ లో రౌడీలతో ఫైట్ చేయడం ఏంటి అని ప్రేక్షకులు డైలమాలో పడ్డారు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో.. సెకండాఫ్ లోగల లోపాలను మార్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన కొంతమంది కోర్టుకు వెళ్లడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ 1993 సెప్టెంబర్ 3న బంగారు బుల్లోడు సినిమా తో కలిపి ఒకే రోజున విడుదల చేయడం జరిగింది. కానీ బంగారు బుల్లోడు సినిమా విజయం సాధించగా నిప్పురవ్వ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…