నందమూరి అభిమానులు తమ అభిమాన నటుడు బాలకృష్ణ సినిమాకోసం ఎదురుచూస్తున్న సమయంలో శ్రీనివాస ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో బాలకృష్ణ సహ నిర్మాతగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ వ్యయంతో నిప్పురవ్వ సినిమా 1991 సెప్టెంబర్ 11న మద్రాసులోని ఏ.వి.ఎమ్ స్టూడియోలో ప్రారంభోత్సవానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇద్దరు హాజరయ్యారు. అయితే ఇందులో బాలకృష్ణ బొగ్గుగని కార్మికుల ప్రతినిధిగా నటించారు. బాలకృష్ణ, విజయశాంతి నటించే సీన్ కు మోహన్ లాల్ కెమెరా స్విచాన్ చేయగా, రజినీకాంత్ క్లాప్ కొట్టడం జరిగింది.
నిర్మాత దేవి వరప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. నిప్పురవ్వ సినిమాలో పోలీస్ పాత్ర లో అలనాటి నటి లక్ష్మి కనిపించగా, బాలకృష్ణ సరసన విజయశాంతి నటించారు. కానీ పోలీస్ పాత్ర కు విజయశాంతిని, బాలకృష్ణ సరసన దివ్యభారతిని ఎంపిక చేద్దామనుకున్నారు. ఆ క్రమంలో దివ్యభారతి గల డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవడంతో.. బాలకృష్ణకు జోడీగా విజయశాంతిని, పోలీస్ పాత్రకు లక్ష్మిని తీసుకొని కథను కాస్త మార్చారు. ఈ సినిమాకు బప్పిలహరి సంగీతాన్ని అందించగా, రండి రండి రండి అనే ఒక్క పాటను వేటూరి రాయగా, రాజ్ కోటి స్వరపరిచారు. ఈ సినిమాలోని డ్యూయెట్ సాంగ్ లను భారీ వ్యయంతో చిత్రీకరించారు. ఇందులోని ఒక పాట కోసం అప్పట్లో నే ఆస్ట్రీయా వెళ్లి చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాలోని పతాక సన్నివేశాలు ఎంతో ఖర్చు చేసి చిత్రీకరించడం జరిగింది. ఆంధ్రా అటవీ ప్రాంతంలో సినిమా షూటింగ్ కి అనుమతి లేకపోవడంతో ముంబాయి ఫారెస్ట్ ఏరియాలో నిప్పురవ్వ సినిమా చిత్రీకరించడం జరిగింది. మొదటి భాగం రషెస్ చూసి దానిలోని లోపాలను మార్చారు.
నిప్పురవ్వ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా తమిళంలో వైజయంతి ఐపీఎస్ పేరుతో విడుదలయ్యింది. ఆ సినిమాలో విజయశాంతి మాస్ ఇమేజ్ తో కనిపించారు. నిప్పురవ్వ సినిమాలో ఎలుగుబంటిని చూసి విజయశాంతి భయపడుతుంది.. అప్పటికీ ఆమె ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా క్లైమాక్స్ లో బాలకృష్ణ కు ధీటుగా కొన్ని ఫైట్స్ విజయశాంతితో చేయించడం జరిగింది. అయితే ఎలుగుబంటిని చూసి భయపడిన విజయశాంతి సినిమా క్లైమాక్స్ లో రౌడీలతో ఫైట్ చేయడం ఏంటి అని ప్రేక్షకులు డైలమాలో పడ్డారు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో.. సెకండాఫ్ లోగల లోపాలను మార్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన కొంతమంది కోర్టుకు వెళ్లడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ 1993 సెప్టెంబర్ 3న బంగారు బుల్లోడు సినిమా తో కలిపి ఒకే రోజున విడుదల చేయడం జరిగింది. కానీ బంగారు బుల్లోడు సినిమా విజయం సాధించగా నిప్పురవ్వ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.