Rajendra Prasad : చిన్న క్యారెక్టర్స్,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నా రాజేంద్ర ప్రసాద్ కు మద్రాసులో ఒకసారి డబ్బింగ్ థియేటర్లో అప్పటి దర్శకుడు వంశీ పరిచయం కావడం జరిగింది.ఆ పరిచయం స్నేహంగా మారి ఒక సినిమా తీయడం వరకు వెళ్ళింది. 1985లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వంశీ దర్శకత్వంలో ప్రేమించు పెళ్ళాడు సినిమాలో భానుప్రియ రాజేంద్రప్రసాద్ నటించారు. ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్యూర్ అయింది.
అప్పటికీ రాజేంద్రప్రసాద్ పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ప్రేమించు పెళ్ళాడు సినిమా హిట్ కాకపోవడంతో హీరోగా ఛాన్స్ లు దొరకవు అలా అని డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పిలువరు, చిన్న క్యారెక్టర్స్ చేయడానికి ఆత్మ గౌరవం అడ్డు వస్తుంది. ఇలా రాజేంద్ర ప్రసాద్ అన్ని గుర్తు చేసుకుంటూ బాధతో తనలో తాను ఏడవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన దర్శకుడు వంశీ రాజేంద్రప్రసాద్ ను ఓదార్చడం మొదలు పెట్టాడు. అలా ఇద్దరూ ఒకే దగ్గర కూర్చొని ప్రేమించు పెళ్ళాడు సినిమా ఎందుకు ఫెయిల్ అయింది కారణాలేంటని ఆలోచించ సాగారు.
ప్రేమించు పెళ్ళాడు చిత్రంలో హీరోయిన్ ని ఫస్టాఫ్ మొత్తం ఏడిస్తే ప్రేక్షకులు అంతగా నవ్వారు. అంటే సెకండాఫ్ ఎక్కడో ప్రేక్షకులకు నచ్చలేదు కావున సెకండాఫ్ మొత్తం కూడా అలానే ఉంటే ఆ సినిమా ఆడేదేమో అని అనుకున్నారు. హీరో ఒక అమ్మాయిని ఏడిపిస్తే ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడు అనేక మంది అమ్మాయిలను ఏడిపిస్తే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే ఆలోచన లోంచి వచ్చిన సినిమానే లేడీస్ టైలర్.
1986 స్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవికిషోర్ నిర్మాత గా వంశీ దర్శకత్వం లో రాజేంద్ర ప్రసాద్ అర్చనలు హీరోహీరోయిన్లుగా లేడీస్ టైలర్ విడుదలయింది. సినిమా ఆద్యంతం నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రాజేంద్ర ప్రసాద్ శుభలేఖ సుధాకర్ కామెడీ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇళయరాజా నేపథ్య సంగీతం, పాటలు ప్రేక్షకులను మైమరిపించేలా చేసాయి. రాజేంద్ర ప్రసాద్ కు లేడీస్ టైలర్ ఒక టర్నింగ్ పాయింట్ సినిమా గా పేర్కొనవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…