దక్షిణాది రాష్ట్రాల నుండి ఉత్తరాది చిత్రాల్లో నటించిన ఎంతోమంది నటీనటులు ఉన్నారు. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల చిత్రాలు మొత్తం మద్రాసులోనే షూటింగ్ జరుపుకునేవి ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి సంబంధించినటువంటి స్టూడియోస్ అక్కడే ఉండడం మూలంగా ఆయా రాష్ట్రా భాష చిత్రాల షూటింగ్ కూడా అక్కడే జరుపుకునేవారు. అలా నటిస్తున్న క్రమంలో అనేకమంది నటీనటులు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించేవారు.
అలా తెలుగు సినిమాల్లో నుండి బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో శ్రీదేవి, జయప్రద ఆ తర్వాత విజయశాంతి కూడా ఓ హిందీ సినిమాలో తెరంగేట్రం చేశారు. అయితే కళాతపస్వి కె.విశ్వనాథ్ 1983 లో వచ్చిన సాగర సంగమం సినిమాకి మంచి పేరు రావడంతో మళ్లీ కమల్ హాసన్ తో స్వాతి ముత్యం అనే సినిమాను రూపొందించడం జరిగింది. కమలహాసన్ అమాయకపు పాత్రలో కనిపించగా, రాధిక భర్తను పోగొట్టుకున్న ఓ విధవరాలు గా నటించింది.
ఈ సినిమాలో కమల్ హాసన్ చేసిన నటన నభూతో న భవిష్యత్ గా చెప్పుకోవచ్చు. ఉత్తమ జాతీయ చిత్రంగా గా స్వాతిముత్యం ఎంపికయింది. అలాగే బంగారు నంది పురస్కారాలను కైవసం చేసుకుంది. కె.విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ కి నంది అవార్డు రావడం జరిగింది. ఈ సినిమాని తమిళంలో సిప్పికుల్, కన్నడంలో సుదీప్, మీనా జంటగా స్వాతి ముత్తుగా నిర్మించారు. 1987లో అనిల్ కపూర్, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా ఇదే సినిమాను ఈశ్వర్ పేరుతో హిందీలో నిర్మించారు. అన్ని భాషల్లో రీమేక్ అయిన స్వాతిముత్యం అద్భుతమైన విజయాన్ని సాధించింది.
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…