Featured

పాలు.. చేపలు కలిపి తింటే చర్మ సమస్యలు వస్తాయా… దీనిలో నిజమెంత?

పాలు ప్రతిరోజు త్రాగటం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చేపలు ఎంతో మంది ఇష్టంగా తినే మాంసాహారం. కానీ ఈ రెండింటిని కలిపి తినటం వల్ల లేదా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే తీసుకోవటం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయని మన పెద్దలు చెబుతుంటారు. నిజానికి పురాతన కాలం నుండి ఆయుర్వేదాన్ని అనుసరించి మన పెద్దలు చేపలు మరియు పాలు కలిపి తీసుకోవటంవల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు.కానీ మన శాస్త్రవేత్తలు దీనిని కొట్టిపారేస్తున్నారు.

పాలు మరియు చేపలు కలిపి తినటం వల్ల అందరిలోనూ చర్మ సమస్యలు తలెత్తుతాయని చెప్పలేము. అయితే ఇది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కొందరిలో ఈ పాలు, చేపలను కలిపి తీసుకోవటంవల్ల స్వల్ప జీర్ణ సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం చేపలు మరియు పాలు కలిపి తినకూడదని కచ్చితంగా చెబుతున్నారు

ఆయుర్వేదం ప్రకారం పాలు మరియు చేపలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవటం వల్ల మన శరీరంలో లూకోడెర్మా స్థితి రావచ్చు. లూకోడెర్మా అంటే స్కిన్ పిగ్మెంటేషన్(చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడటం). కానీ కొందరు మాత్రం చేపలు అసిడిక్ ప్రభావాన్ని మరియు పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల అవి మన శరీరంలో జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు.

ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజు సూత్ మాత్రం చేపలు మరియు పాలు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనటానికి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. అందువలన పాలతో కలిపి ఎటువంటి ఆహారాన్ని అయినా తీసుకోవచ్చని ఆమె పేర్కొంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

3 hours ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

3 hours ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

3 hours ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

4 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

4 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

5 hours ago