పాలు ప్రతిరోజు త్రాగటం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చేపలు ఎంతో మంది ఇష్టంగా తినే మాంసాహారం. కానీ ఈ రెండింటిని కలిపి తినటం వల్ల లేదా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే తీసుకోవటం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయని మన పెద్దలు చెబుతుంటారు. నిజానికి పురాతన కాలం నుండి ఆయుర్వేదాన్ని అనుసరించి మన పెద్దలు చేపలు మరియు పాలు కలిపి తీసుకోవటంవల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు.కానీ మన శాస్త్రవేత్తలు దీనిని కొట్టిపారేస్తున్నారు.
పాలు మరియు చేపలు కలిపి తినటం వల్ల అందరిలోనూ చర్మ సమస్యలు తలెత్తుతాయని చెప్పలేము. అయితే ఇది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కొందరిలో ఈ పాలు, చేపలను కలిపి తీసుకోవటంవల్ల స్వల్ప జీర్ణ సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం చేపలు మరియు పాలు కలిపి తినకూడదని కచ్చితంగా చెబుతున్నారు
ఆయుర్వేదం ప్రకారం పాలు మరియు చేపలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవటం వల్ల మన శరీరంలో లూకోడెర్మా స్థితి రావచ్చు. లూకోడెర్మా అంటే స్కిన్ పిగ్మెంటేషన్(చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడటం). కానీ కొందరు మాత్రం చేపలు అసిడిక్ ప్రభావాన్ని మరియు పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల అవి మన శరీరంలో జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు.
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజు సూత్ మాత్రం చేపలు మరియు పాలు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనటానికి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. అందువలన పాలతో కలిపి ఎటువంటి ఆహారాన్ని అయినా తీసుకోవచ్చని ఆమె పేర్కొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…