Thottempudi Venu: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు తొట్టెంపూడి వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్వయంవరం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నటుడు వేణు ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.
ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వేణు ప్రస్తుతం ఇండస్ట్రీ దూరమయ్యారు.అయితే ఈ విధంగా వేణు ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనంత ప్రభు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వేణు గురించి మాట్లాడుతూ.. స్వయంవరం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సమయంలో ఆయనకు క్రమంగా ఆఫర్లు తగ్గిపోయాయి.
కెరీర్లు ఇంజనీర్ కావాలనుకున్న వేణు సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇలా ఇండస్ట్రీలోకి వచ్చారని అయితే ప్రస్తుతం తనకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో తన భార్యతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. 2001లో అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఈమె మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేయడంతో ప్రస్తుతం తనతో కలిసి బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. రామాచారి అనే సినిమాలో వేణు చివరిసారిగా హీరోగా నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ బావ గా కనిపించారు. ఇలా ఇండస్ట్రీలోఅన్ని రకాల పాత్రల్లో నటించడం పోవడమే అతనికి మైనస్ అయిందని దీని వల్ల తనకు ఆఫర్లు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యారని అనంత ప్రభు తెలిపారు. అయితే తనకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు పాత్రలు దొరికితే తప్పకుండా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…