IYR Krishna Rao : ఎండలు మడిపోతున్నవేళ రాజకీయ వేడి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రగులుతోంది. ఇంతకాలం బ్యూరో క్రాట్ గా ఉన్న ఐవైఆర్ కృష్ణా రావు గారు ప్రస్తుతం రిటైర్మెంట్ తరువాత బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన సర్వీస్ లో కలెక్టర్ గాను అలాగే సిఎస్ గాను పనిచేసిన ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ సెక్రటరీగా పనిచేసారు. కృష్ణా రావు గారు ఆయన సర్వీస్ గురించి, ప్రస్తుత రాజకీయ పార్టీలు, నెక్స్ట్ ఎలక్షన్ గెలుపు గుర్రాల గురించి యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
సిఎస్ గా నా ఓటు ఆ సీఎంకే…
కృష్ణా రావు గారు ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతూ ఏపీలో కంటే బీజేపీ తెలంగాణలో బలంగా ఉందని నెక్స్ట్ 2024 లో అధికారం మాదే అంటూ చెప్పారు. తెలంగాణలో బలంగా ఉందని ఖచ్చితంగా గట్టిపోటీ ఉంటుందని అపుడే రాష్ట్రంలో బీజేపీ వేవ్ తెలుస్తోందని తెలిపారు. ఇక తాను సిఎస్ గా అటు రాజశేఖర్ రెడ్డి వద్ద అలాగే చంద్రబాబు వద్ద ఇద్దరు సీఎంల దగ్గరా పనిచేసారు.
అయితే ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారనే ప్రశ్నకు చంద్రబాబు నాయుడు అంటూ సమాధానం చెప్పారు. విభజిత ఏపీకి మొదటి సీఎం గా చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కృష్ణా రావు గారు విబేదించడం అప్పట్లో చర్చనీయాంశం కాగా నేడు సిఎస్ గా సీఎంను ఎంచుకోమంటే చంద్రబాబు అని చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక దేశ సరిహద్ధుల్లో ఉండే సైనికులా లేక మన మధ్య ఉండి కాపాడే పోలీసులను ఎంచుకుంటారా అంటే ఆర్మీ అని సమాధానం చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…