Manchu Manoj: మంచు మనోజ్ రెండోసారి పెళ్లికొడుకుగా మారిపోయారు.ఈయన ఇది వరకే ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తనకు విడాకులు ఇచ్చినటువంటి మనోజ్ అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఈయన కర్నూలు జిల్లా ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక రెడ్డితో రిలేషన్ లో ఉన్నారు.
ఇలా గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇకపోతే మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఏమాత్రం ఇష్టం లేదని సమాచారం.
ఇలా భూమ మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి మోహన్ బాబు తన పెళ్లికి కూడా రావడంలేదని తనతో పాటు తన పెద్ద కుమారుడు విష్ణు కూడా ఈ పెళ్లికి దూరంగా ఉంటున్నారని సమాచారం. అందుకే మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా మారి తన ఇంటి వద్ద మనోజ్ పెళ్లి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడానికి గల కారణమేంటనే విషయానికి వస్తే మౌనిక టిడిపి నాయకుడి కుమార్తె కావడం ఒక కారణమైతే ఆమె ఇది వరకే పెళ్లి చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చి విడాకులు తీసుకున్న తర్వాత మనోజ్ ను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆమెను తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి మోహన్ బాబు ఇష్టపడటం లేదని తెలుస్తుంది.ఇక ఈ విషయంలో వీరి మధ్య గొడవలు కూడా జరిగాయని అందుకే మోహన్ బాబు మనోజ్ కి రావలసిన ఆస్తిని కూడా తనకు ఇచ్చేసినట్టు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది.. నిజంగానే మోహన్ బాబు పెళ్లికి దూరంగా ఉంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…