J.D Chakravarthy : శివ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులు గుర్తిస్తారు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జేడి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తంపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ అటు తమిళం, కన్నడ, మాలయం సినిమాల్లోనూ నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా దయ అనే వెబ్ సిరీస్ తో వస్తోన్న చక్రి ఆ ప్రొమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నాకు, కృష్ణ వంశీ కి విబేధాలకు కారణం అదే…
జేడి చక్రవర్తి కెరీర్ లో నెంబర్ వన్ సినిమాగా గులాబీ మిగిలిపోతుంది. ఆ సినిమాలో తొలిసారిగా చక్రి హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా సమయానికి కృష్ణ వంశీ, జేడి ఇద్దరూ మంచి స్నేహితులు. మొదట కథ చెప్పేటప్పుడే జేడిని హీరోగా పెట్టి ఈ సినిమా తీయాలని కృష్ణ వంశీ ఫిక్స్ అయిపోయాడట. ఇక సినిమా తీసేందుకు కొందరు నిర్మాతలు వస్తున్నా జేడి చక్రవర్తి ని హీరోగా ఒప్పుకోలేదట. చివరికి జేడి తనకు ఉన్న ఒక ఇల్లును తాకట్టు పెట్టి కొంత డబ్బు తెచ్చి సినిమా స్టార్ట్ చేయగా విషయం తెలుసుకున్న ఆర్జివి గులాబీ సినిమా కథ ఏంటి, ఎవరెవరు నటిస్తున్నారో కూడా తెలియకుండానే సినిమా ప్రొడక్షన్ చేశారట.
ఆపైన అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్టులో డబ్బు పెట్టారట. అలా చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యాక కృష్ణ వంశీ, జేడి ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారట. మళ్ళీ దయ వెబ్ సిరీస్ ప్రమోషన్సలో ఈ మధ్యనే కలిశామని జేడి చెప్తూ అపుడు మా మధ్య గొడవలు రావడానికి కారణం మా మధ్య ఉన్న ఇగోనే. ఒళ్ళు కొవ్వెక్కి ఇద్దరికీ నా వల్ల సినిమా హిట్ అయిందని ఎవరికి వారు అనుకున్నాం కానీ మన ఇద్దరి వల్ల సినిమా హిట్ అయిందని అనుకోలేదు అంటూ జేడి చెప్పారు.
చాలామంది పల్లీలను చిన్నపాటి స్నాక్గా మాత్రమే భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం వేరుశెనగలను పూర్తి స్థాయి పోషకాహారంగా గుర్తిస్తున్నారు.…
పూజా కార్యక్రమాల్లో హారతి అనేది ముఖ్యమైన భాగంగా భావిస్తారు. దేవుడికి నైవేద్యం సమర్పించిన తరువాత కర్పూరం లేదా దీపంతో హారతి…
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం మన సంస్కృతిలో భాగం. అయితే కొన్ని ప్రత్యేక మొక్కలకు ఆధ్యాత్మికంగా, వాస్తు పరంగా కూడా…
ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2026 సందర్భంగా శ్వాసకోశ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మే…
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలపై దృష్టి పెట్టడం అవసరం అవుతోంది. ముఖ్యంగా ఉదయం తీసుకునే…
ఎండాకాలం వచ్చేసరికి శరీరానికి చల్లదనం కోసం చాలా మంది పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే…