Jabardasth Anchor Sowmya: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎన్నో సంవత్సరాలుగా ప్రసారమౌతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ కామెడీ షో ద్వారా కమెడియన్లతో పాటు జడ్జిలు , యాంకర్లు కూడా బాగా పాపులర్ అయ్యారు. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన నాగబాబు జబర్దస్త్ జడ్జిగా బాగా ఫేమస్ అయ్యాడు. అలాగే హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన రోజా జబర్దస్త్ పొందింది.
ఇక జబర్దస్త్ యాంకర్లుగా రష్మి, అనసూయ దక్కించుకున్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ లో యాంకర్లుగా కొనసాగుతున్న అనసూయ, రష్మీ తమ యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.
ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం అనసూయకి సినిమా అవకాశాలు ఎక్కువగా రావటంతో జబర్దస్త్ కి దూరం అయింది. అనసూయ జబర్దస్త్ కి దూరమైన తర్వాత ఒక కొత్త యాంకర్ వస్తుందని ప్రేక్షకులు భావించారు. కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ లో కూడా రష్మి ని యాంకర్ గా ఉంచి కొంతకాలం షో నడిపించారు. ఇక జబర్దస్త్ కొత్త యాంకర్ గా సీరియల్ నటి సౌమ్యరావును తెరపైకి తెచ్చారు. షో లో ఎంట్రీ ఇవ్వటంతోనే సౌమ్య అందరి మీద పంచులు వేస్తూ సందడి చేసింది. ఇక ప్రస్తుతం జబర్థస్త్ యాంకర్ గా కొనసాగుతున్న సౌమ్య యాంకరింగ్ గురించి ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అనసూయతో పోల్చితే సౌమ్య గ్లామర్ విషయంలో కానీ…యాంకరింగ్ విషయంలో కానీ ఏమాత్రం సరితుగటం లేదని ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. యాంకరింగ్ చేసే సమయంలో సౌమ్యరావు చాలా ఫాస్ట్ గా మాట్లాడుతుంది. కాకుండా కమెడియన్ల మీద పంచులు వేసే సమయంలో కూడా ఆమె పంచులు చాలా సీరియస్గా అనిపిస్తాయి. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా సౌమ్య అనసూయను దాటలేకపోతోంది. ఇలా అన్ని విషయాలలోనూ అనసూయ మందు సౌమ్య తేలిపోతోంది. దీంతో జబర్దస్త్ అభిమానులు సౌమ్య రావుకి బదులు రశ్మినే మళ్ళీ యాంకర్ గా తెచ్చి పెట్టండి బాబు అంటూ తమ గోడు వినిపిస్తున్నారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…