AP politics: ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలక నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా నామినేషన్ దాఖలు ఎప్పుడు ఎలక్షన్స్ ఎన్నికల ఫలితాలు విడుదల తేదీలను గురించి క్లారిటీ ఇచ్చారు. మే 13వ తేదీ ఎన్నికలు జరగగా జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలను తెలియజేయబోతున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలియజేశారు. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో చాలా హడావిడిగా కనిపించారు. ఇక ఈయన ఏకంగా ఎన్నికల ఫలితాలు విడుదలై తానే గెలిచాను అన్న ధోరణిలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.ఐదేళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని తన ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ ట్విట్టర్ ద్వారా ఈయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా జగన్ ట్వీట్ చేస్తూ.. పోలింగ్ రోజుని హైలైట్ చేస్తూ మే 13, 2024 సిద్ధం.. అంటూ ట్వీట్ చేశారు.
స్పందించని పవన్..
ఇలా వీరిద్దరి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు..అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నికల గురించి ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం గమనార్హం. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అన్ని పార్టీ అధినేతలు అభ్యర్థులను ప్రకటించి ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…