AP politics: ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలక నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా నామినేషన్ దాఖలు ఎప్పుడు ఎలక్షన్స్ ఎన్నికల ఫలితాలు విడుదల తేదీలను గురించి క్లారిటీ ఇచ్చారు. మే 13వ తేదీ ఎన్నికలు జరగగా జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలను తెలియజేయబోతున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలియజేశారు. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో చాలా హడావిడిగా కనిపించారు. ఇక ఈయన ఏకంగా ఎన్నికల ఫలితాలు విడుదలై తానే గెలిచాను అన్న ధోరణిలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.ఐదేళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని తన ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ ట్విట్టర్ ద్వారా ఈయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా జగన్ ట్వీట్ చేస్తూ.. పోలింగ్ రోజుని హైలైట్ చేస్తూ మే 13, 2024 సిద్ధం.. అంటూ ట్వీట్ చేశారు.
స్పందించని పవన్..
ఇలా వీరిద్దరి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు..అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నికల గురించి ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం గమనార్హం. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అన్ని పార్టీ అధినేతలు అభ్యర్థులను ప్రకటించి ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…