Political News

‘జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు..’ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు !

ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఎవరిని టచ్ చేయకూడదో వారినే టార్గెట్ చేశారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు,” అంటూ అనిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Jagan dug his own hole..’ Home Minister Anitha’s sensational comments!

ఆకివీడు పర్యటనలో జగన్ పాలనపై విమర్శలు

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సోమవారం పర్యటించిన హోంమంత్రి అనిత, అక్కడ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, కనుమూరి భారత్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

“జగన్ ఎవరిని టచ్ చేయకూడదో వారినే టచ్ చేశారు. తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవాలి లేకపోతే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. కానీ జగన్ ప్రవర్తన వేరేలా ఉంది. ఎవరు తప్పు అడిగితే వారిపై కేసులు పెడతా, గట్టిగా మాట్లాడితే జైలుకు పంపిస్తా అన్న ధోరణితో వ్యవహరించారు,” అని అనిత విమర్శించారు. అలాగే వైసీపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును క్రూరంగా హింసించారని ఆరోపించారు.

ప్రజల పక్షాన జవాబుదారీతనం: అనిత స్పష్టీకరణ

“రఘురామ కుటుంబంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేము ఉన్నాం అని ధైర్యం ఇచ్చాం. ప్రజలు ఓటు వేస్తే నాయకుడికి జవాబుదారీతనం ఉండాలి. ఇప్పుడు మేమంతా ప్రజల పక్షాన జవాబుదారిగా ఉన్నాం,” అని అనిత తెలిపారు.

తన పర్యటనపై మాట్లాడుతూ – “నన్ను చూసేందుకు చెట్లు కోయాల్సిన అవసరం లేదు, షాపులు మూయాల్సిన పని లేదు. పరదాలు వేసే సమయం కాదు. నేను ఓట్లు అడగడానికి రాలేదు. ఆకివీడు ప్రజల సమస్యలు వినేందుకు, వారికి అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడానికి వచ్చా,” అన్నారు.

‘అభివృద్ధి, సంక్షేమమే నా అజెండా’

“నా అజెండా అభివృద్ధి, సంక్షేమమే.. పగలు, ప్రతీకారం కాదు,” అంటూ అనిత తన పాలనకు ప్రజల మద్దతును కోరారు. రాష్ట్ర రాజకీయ వేదికపై జగన్ పాలనపై ఇటువంటి విమర్శలు అనిత స్థాయిలో రావడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఏ మేరకు రాజకీయ వేడిని పెంచుతాయో చూడాలి.

telugudesk

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

17 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

17 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

17 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

18 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

18 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

18 hours ago