Jagan dug his own hole..' Home Minister Anitha's sensational comments!
ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఎవరిని టచ్ చేయకూడదో వారినే టార్గెట్ చేశారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు,” అంటూ అనిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సోమవారం పర్యటించిన హోంమంత్రి అనిత, అక్కడ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, కనుమూరి భారత్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
“జగన్ ఎవరిని టచ్ చేయకూడదో వారినే టచ్ చేశారు. తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవాలి లేకపోతే ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి. కానీ జగన్ ప్రవర్తన వేరేలా ఉంది. ఎవరు తప్పు అడిగితే వారిపై కేసులు పెడతా, గట్టిగా మాట్లాడితే జైలుకు పంపిస్తా అన్న ధోరణితో వ్యవహరించారు,” అని అనిత విమర్శించారు. అలాగే వైసీపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును క్రూరంగా హింసించారని ఆరోపించారు.
“రఘురామ కుటుంబంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేము ఉన్నాం అని ధైర్యం ఇచ్చాం. ప్రజలు ఓటు వేస్తే నాయకుడికి జవాబుదారీతనం ఉండాలి. ఇప్పుడు మేమంతా ప్రజల పక్షాన జవాబుదారిగా ఉన్నాం,” అని అనిత తెలిపారు.
తన పర్యటనపై మాట్లాడుతూ – “నన్ను చూసేందుకు చెట్లు కోయాల్సిన అవసరం లేదు, షాపులు మూయాల్సిన పని లేదు. పరదాలు వేసే సమయం కాదు. నేను ఓట్లు అడగడానికి రాలేదు. ఆకివీడు ప్రజల సమస్యలు వినేందుకు, వారికి అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడానికి వచ్చా,” అన్నారు.
“నా అజెండా అభివృద్ధి, సంక్షేమమే.. పగలు, ప్రతీకారం కాదు,” అంటూ అనిత తన పాలనకు ప్రజల మద్దతును కోరారు. రాష్ట్ర రాజకీయ వేదికపై జగన్ పాలనపై ఇటువంటి విమర్శలు అనిత స్థాయిలో రావడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఏ మేరకు రాజకీయ వేడిని పెంచుతాయో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…