Featured

ఆన్ లైన్ లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితా.. పేరు లేకపోతే ఏం చేయాలంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 80 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాలలో జగన్ సర్కార్ అమ్మఒడి స్కీమ్ కు సంబంధించిన నగదును జమ చేస్తోంది. అమ్మఒడి స్కీమ్ కు ఎంపికైన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను విడుదల చేసింది.

రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ మేరకు ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామ, వార్డ్ సచివాలయాల్లో సైతం ప్రభుత్వం ఈ జాబితాను అందుబాటులో ఉంచనుంది. ఎవరైనా అర్హులై ఉండి ప్రాథమిక జాబితాలో పేరు రాకపోతే వాళ్లు మరోసారి అమ్మఒడి స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జగన్ సర్కార్ ఈ నెల 30వ తేదీన అమ్మఒడి స్కీమ్ కు సంబంధించిన తుది జాబితాను విడుదల చేయనుంది.

విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వం మార్పులుచేర్పులు చేయనుంది. జగన్ సర్కార్ లెక్కల ప్రకారం మొత్తం 83,72,254 మంది అమ్మఒడి స్కీమ్ ద్వారా ప్రయోజననం పొందనున్నారు. వీరిలో 72,74,674 మంది ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కాగా 10,97,580 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు.

తుది జాబితాలో పేరు ఉన్నవారికి 2021 సంవత్సరం జనవరి 9వ తేదీన 15,000 రూపాయలు జమవుతుంది. విద్యార్థుల తల్లి ఖాతాలో ప్రభుత్వం ఈ నగదును జమ చేయనుంది. https://jaganannaammavodi.ap.gov.in/ , https://studentinfo.ap.gov.in/ వెబ్ సైట్ల ద్వారా అమ్మఒడి స్కీమ్ కు అర్హులో కాదో తెలుసుకోవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

2 days ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

2 days ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

3 days ago