ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 80 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాలలో జగన్ సర్కార్ అమ్మఒడి స్కీమ్ కు సంబంధించిన నగదును జమ చేస్తోంది. అమ్మఒడి స్కీమ్ కు ఎంపికైన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను విడుదల చేసింది.
రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ మేరకు ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామ, వార్డ్ సచివాలయాల్లో సైతం ప్రభుత్వం ఈ జాబితాను అందుబాటులో ఉంచనుంది. ఎవరైనా అర్హులై ఉండి ప్రాథమిక జాబితాలో పేరు రాకపోతే వాళ్లు మరోసారి అమ్మఒడి స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జగన్ సర్కార్ ఈ నెల 30వ తేదీన అమ్మఒడి స్కీమ్ కు సంబంధించిన తుది జాబితాను విడుదల చేయనుంది.
విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను పరిశీలించి ప్రభుత్వం మార్పులుచేర్పులు చేయనుంది. జగన్ సర్కార్ లెక్కల ప్రకారం మొత్తం 83,72,254 మంది అమ్మఒడి స్కీమ్ ద్వారా ప్రయోజననం పొందనున్నారు. వీరిలో 72,74,674 మంది ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కాగా 10,97,580 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు.
తుది జాబితాలో పేరు ఉన్నవారికి 2021 సంవత్సరం జనవరి 9వ తేదీన 15,000 రూపాయలు జమవుతుంది. విద్యార్థుల తల్లి ఖాతాలో ప్రభుత్వం ఈ నగదును జమ చేయనుంది. https://jaganannaammavodi.ap.gov.in/ , https://studentinfo.ap.gov.in/ వెబ్ సైట్ల ద్వారా అమ్మఒడి స్కీమ్ కు అర్హులో కాదో తెలుసుకోవచ్చు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…