Jahnvi Kapoor: ఈ మధ్యకాలంలో నటీనటులు తమ సినిమాని ప్రమోట్ చేయడం కోసం సరికొత్త ప్రయత్నాలను చేస్తూ పెద్ద ఎత్తున నేటిజన్ ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున నేటిజన్ ల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సైతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చేసిన పని పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం మిల్లి. ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరైనటువంటి ఈమె తాజాగా ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్ లో దర్శనమిచ్చారు. అయితే అక్కడ జాన్వీ కపూర్ ను చూసినటువంటి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో పాప్ కార్న్ అమ్ముతూ కనిపించారు. ఇలా జాన్వీ కపూర్ పాప్ కార్న్ అమ్మడం ఏంటి అని అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురికాగా అనంతరం ఇది తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చేశారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ వీడియో పై స్పందిస్తూ.. సినిమా ప్రమోషన్ల కోసం ఏం చేయడానికైనా వెనకాడరు కదా…చివరికి వాష్ రూమ్ క్లీన్ చేయమన్న చేస్తారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు నువ్వు బోనీకపూర్ కూతురు కాకపోయి ఉంటే నీకు ఈ పని కరెక్ట్ గా సరిపోయేది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జాన్వీ కపూర్ చేసిన పని కారణంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…