Janardhan Rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పోలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండ పలు సీరియల్స్ లో కూడా నటించారు. ECILలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు లో కూడా పని చేసారు, యాక్టింగ్ కోర్స్ కుడా చేసిన ఈయన ఆ అనుభవంతో ఎన్నో చిత్రాలలో, సీరియల్స్ లో మరియు ఎన్నో వేల స్వదేశీ, విదేశీ సినిమా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక సినిమాల్లో హీరోలతో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ ఇప్పటి తరం హీరోలు అప్పటి తరం హీరోలకు ఉన్న తేడా చెప్పారు.
బన్నీ కొట్టేసరికి నిజంగానే తగిలింది…
అప్పటి హీరోలు హీరోల్లాగా ఉండేవారు. షూటింగ్ సమయంలో ఎక్కువగా మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు పలకరింపు వరకు మాత్రమే వారితో మాట కలిపే వాళ్ళం అంతకు మించి చనువు వాళ్ళు ఇచ్చేవారు కాదు, మేము తీసుకునే వాళ్ళం కాదు అంటూ జెన్నీ అల్పటి హీరోలతో ఆయన అనుభవాలను చెప్పారు. ఇక ఇప్పటితరం హీరోలలో అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించినపుడు నేను బన్నీ తండ్రి పాత్ర చనిపోయినపుడు కామెంట్ చేస్తే అతను కోపంలో నన్ను కొట్టాలి. అయితే సీన్ రిహార్సెల్ చేస్తున్నపుడు కొడితే నిజంగానే చిటికెన వేలు తగిలి నా కళ్ళజోడు కింద పడి పగిలిపోయింది. సీన్ ఓకే అయింది. ఇక వెంటనే బన్నీ మేనేజర్ ను పంపి ఆయన కళ్లజోడు పగిలి పోయింది కొత్తది కొనివండి అంటూ బన్నీ మేనేజర్ ను నా వద్దకు పంపారు.
నేను అదేమీ వద్దని చెబితే అల్లు అర్జున్ వచ్చి మీరు సీనియర్ నటులు, మా చిన్నతనం నుండి చూస్తున్నాం అలా అంటారేమిటి నావల్ల పగిలిపోయాయి అంటూ అనడంతో ఇక కాదనలేక పోయాను. ఇక వెంటనే నాకు మీరు ఒక వరం ఇయ్యండి అంటూ అడిగాను. మీ ప్రతి సినిమాలో ఒక చిన్న వేషం ఇప్పించండి అనగానే ఆయన అంతేనా ఇక వరం అంటే ఏమడుగుతారో అనుకున్నాను అంటూ నవ్వేశారు. ఇక ఆ తరువాత ఎపుడైనా కనిపిస్తే ఏంటండీ కళ్లజోడు బాగుందా బాగా కనిపిస్తున్నాయా అని అడుగుతారు అంటూ బన్నీతో తన ఫన్నీ ఇన్సిడెంట్ ను జెన్నీ గారు పంచుకున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…