Actress Meena: తెలుగు తమిళ భాషలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మీనా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇక మీనా దంపతులకు ఒక కుమార్తె జన్మించిన తర్వాత ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఇలా సెకండ్ ఇన్నింగ్స్ వరస సినిమాలు చేస్తే ఎంతో బిజీగా గడుపుతున్న మీనా జీవితంలో విషాద ఘటన చోటుచేసుకుంది.పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ మీనా భర్త విద్యాసాగర్ మరణించడంతో ఒక్కసారిగా ఈమె కుప్పకూలిపోయారు. అయితే భర్త మరణం తర్వాత ఎంతోమంది స్నేహితులు నటీమణులు తరచూ మీనా ఇంటికి వెళ్లి ఆమెను ఓదార్చు తనకి అండగా నిలిచారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లు తరచు మీనా ఇంటికి వెళ్తూ తనని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు.ఇకపోతే మీనా ఇప్పుడిప్పుడే తన భర్త మరణం నుంచి బయటపడుతూ సాధారణ వ్యక్తిలా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మీనా తన స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇకపోతే ఈమె ప్రస్తుతం తన స్నేహితురాలితో కలిసి ఫారెన్ వెకేషన్ లో ఉన్నారు.
మీనా తన స్నేహితురాలు స్టైలిస్ట్ రేణుక ప్రవీణ్ తో కలిసి విదేశాలలో పలు ప్రదేశాలలో తీసుకున్నటువంటి ఒక రీల్ వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈమె ఫారిన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇవి చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మీనా తన భర్త మరణం నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు ఈమెను ఇలా సంతోషంగా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈమె ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ అభిమానులు కామెంట్ లు చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…