Janardhan Rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పొలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఇక తనతో పాటు కమెడియన్స్ గా ఎదిగిన ఏవిఎస్, సుత్తి వేలు, బ్రహ్మానందం, బాబు మోహన్, గుండు హనుమంతరావు, ఐరన్ లెగ్ శాస్త్రి, తనికెళ్ళ భరణి వంటి వారి గురించి ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఐరన్ లెగ్ శాస్త్రి అమాయకుడు…
సినిమాల్లో నటించేటపుడు తోటి నటినటులతో పరిచయం స్నేహం మామూలే. ఇక అప్పటి సీనియర్ నటులైన బ్రహ్మానందం, సుత్తివేలు, ఐరన్ లెగ్ శాస్త్రి వంటి వారితో మంచి అనుబంధం ఉన్న జెన్నీ గారు ఐరన్ లెగ్ శాస్త్రి, గుండు హనుమంత రావు, సుత్తివేలు వంటి వారు మరణించడం వల్ల చాలా బాధపడ్డారట. మనతో పాటు ఉన్న వాళ్ళు ఆర్థికంగా బాగోలేకపోయినా, అనారోగ్యం పాలైనా చాలా బాధగా ఉంటుంది. వారికి అవకాశాలు ఇప్పించాగలిగేంత స్థాయి లేక అలాగే వాళ్ళ అనారోగ్యాన్ని తగ్గించగలిగేంత శక్తి మనకు ఉండదు అది ఇంకా బాధ కలిగిస్తుంది అంటూ చెప్పారు.
ఐరన్ లెగ్ శాస్త్రి విషయంలో అతను చివరి రోజుల్లో తన సొంతూరు వెళ్ళిపోయాడు. అక్కడే అనారోగ్యంతో మరణించడం వల్ల ఇండస్ట్రీకి దూరమవ్వడం వల్ల ఎవరికీ తన గురించి పెద్దగా తెలియలేదు. పంతులుగా ఉన్న ఐరన్ లెగ్ శాస్త్రి అకస్మాత్తుగా వచ్చిన సినిమా అవకాశం వల్ల స్టార్ అయ్యాడు. కానీ ఆ స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడం తనకు తెలియలేదు. చాలా అమాయకుడు, ఎపుడూ ఇలానే అవకాశాలు ఉంటాయని నమ్మాడు, ఆర్థికంగా డబ్బు పొదుపు చేసుకోలేదు అందుకే చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో మరణించాడు అంటూ ఐరన్ లెగ్ శాస్త్రి గారిని తలుచుకున్నారు. ఇక గుండు హనుమంతరావు గారి గురించి మాట్లాడుతూ ఆయన ఆర్థికంగా బాగున్నారు. అయితే కిడ్నీ సమస్య రావడం వల్ల వారంలో రెండు సార్లు డైయాలసిస్ చేయాల్సి వచ్చేది. అలా అనారోగ్య సమస్యలతో మరణించాడు అంటూ చెప్పారు.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…