Janardhan Rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పొలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఇక తనతో పాటు కమెడియన్స్ గా ఎదిగిన ఏవిఎస్, సుత్తి వేలు, బ్రహ్మానందం, బాబు మోహన్, గుండు హనుమంతరావు, ఐరన్ లెగ్ శాస్త్రి, తనికెళ్ళ భరణి వంటి వారి గురించి ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఐరన్ లెగ్ శాస్త్రి అమాయకుడు…
సినిమాల్లో నటించేటపుడు తోటి నటినటులతో పరిచయం స్నేహం మామూలే. ఇక అప్పటి సీనియర్ నటులైన బ్రహ్మానందం, సుత్తివేలు, ఐరన్ లెగ్ శాస్త్రి వంటి వారితో మంచి అనుబంధం ఉన్న జెన్నీ గారు ఐరన్ లెగ్ శాస్త్రి, గుండు హనుమంత రావు, సుత్తివేలు వంటి వారు మరణించడం వల్ల చాలా బాధపడ్డారట. మనతో పాటు ఉన్న వాళ్ళు ఆర్థికంగా బాగోలేకపోయినా, అనారోగ్యం పాలైనా చాలా బాధగా ఉంటుంది. వారికి అవకాశాలు ఇప్పించాగలిగేంత స్థాయి లేక అలాగే వాళ్ళ అనారోగ్యాన్ని తగ్గించగలిగేంత శక్తి మనకు ఉండదు అది ఇంకా బాధ కలిగిస్తుంది అంటూ చెప్పారు.
ఐరన్ లెగ్ శాస్త్రి విషయంలో అతను చివరి రోజుల్లో తన సొంతూరు వెళ్ళిపోయాడు. అక్కడే అనారోగ్యంతో మరణించడం వల్ల ఇండస్ట్రీకి దూరమవ్వడం వల్ల ఎవరికీ తన గురించి పెద్దగా తెలియలేదు. పంతులుగా ఉన్న ఐరన్ లెగ్ శాస్త్రి అకస్మాత్తుగా వచ్చిన సినిమా అవకాశం వల్ల స్టార్ అయ్యాడు. కానీ ఆ స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడం తనకు తెలియలేదు. చాలా అమాయకుడు, ఎపుడూ ఇలానే అవకాశాలు ఉంటాయని నమ్మాడు, ఆర్థికంగా డబ్బు పొదుపు చేసుకోలేదు అందుకే చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో మరణించాడు అంటూ ఐరన్ లెగ్ శాస్త్రి గారిని తలుచుకున్నారు. ఇక గుండు హనుమంతరావు గారి గురించి మాట్లాడుతూ ఆయన ఆర్థికంగా బాగున్నారు. అయితే కిడ్నీ సమస్య రావడం వల్ల వారంలో రెండు సార్లు డైయాలసిస్ చేయాల్సి వచ్చేది. అలా అనారోగ్య సమస్యలతో మరణించాడు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…