Siddharth -Aditi Rao Hydari: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నటువంటి వారిలో నటుడు సిద్దార్థ్ నటి అదితి రావు హైదరి జంట ఒకటి.వీరిద్దరూ కలిసి గత ఏడాది దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ నటించినప్పటికీ సిద్దార్థ్ అదితి జంటగా నటించారు.ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కూడా ముంబై వీధులలో కలిసి కెమెరా కంటికి కనబడుతున్నారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరాయి.ఇక వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారి వీరిద్దరూ ఈ ప్రశ్నను దాటవేస్తున్నారే తప్ప ఎవరు కూడా ఖండించే ప్రయత్నం చేయడం లేదు. ఇకపోతే వీరిద్దరూ జంటగా పలు సందర్భాలలో మీడియా కంటికి చిక్కిన సంగతి మనకు తెలిసిందే.
ఇక తాజాగా వీరిద్దరూ జంటగా నటుడు శర్వానంద్ పెళ్లిలో సందడి చేశారు. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ పెళ్లికి రావడానికి ముంబై ఎయిర్పోర్ట్ లోజంటగా కనిపించినటువంటి వీరిద్దరూ జైపూర్ చేరుకొని శర్వానంద్ వివాహానికి హాజరయ్యారు. అదేవిధంగా జైపూర్ లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి వెళ్లి ఆమెను కలిసి తనతో దిగినటువంటి ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇలా వీరిద్దరూ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరిద్దరూ పెళ్లికి మాత్రమే కాకుండా శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా ఇద్దరు జంటగా కలిసి వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లడంతో వీరి గురించి వచ్చే రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఇలా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలు గురించి ఖండించే ప్రయత్నం కానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…