Siddharth -Aditi Rao Hydari: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నటువంటి వారిలో నటుడు సిద్దార్థ్ నటి అదితి రావు హైదరి జంట ఒకటి.వీరిద్దరూ కలిసి గత ఏడాది దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ నటించినప్పటికీ సిద్దార్థ్ అదితి జంటగా నటించారు.ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కూడా ముంబై వీధులలో కలిసి కెమెరా కంటికి కనబడుతున్నారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరాయి.ఇక వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారి వీరిద్దరూ ఈ ప్రశ్నను దాటవేస్తున్నారే తప్ప ఎవరు కూడా ఖండించే ప్రయత్నం చేయడం లేదు. ఇకపోతే వీరిద్దరూ జంటగా పలు సందర్భాలలో మీడియా కంటికి చిక్కిన సంగతి మనకు తెలిసిందే.
ఇక తాజాగా వీరిద్దరూ జంటగా నటుడు శర్వానంద్ పెళ్లిలో సందడి చేశారు. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ పెళ్లికి రావడానికి ముంబై ఎయిర్పోర్ట్ లోజంటగా కనిపించినటువంటి వీరిద్దరూ జైపూర్ చేరుకొని శర్వానంద్ వివాహానికి హాజరయ్యారు. అదేవిధంగా జైపూర్ లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి వెళ్లి ఆమెను కలిసి తనతో దిగినటువంటి ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇలా వీరిద్దరూ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరిద్దరూ పెళ్లికి మాత్రమే కాకుండా శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా ఇద్దరు జంటగా కలిసి వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లడంతో వీరి గురించి వచ్చే రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఇలా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలు గురించి ఖండించే ప్రయత్నం కానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…