వైసీపీ ఎంపీ రఘురామ అరెస్ట్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇదే విధంగా నిన్న అరెస్ట్ చేశారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరెస్ట్ కు ఇది సమయం కాదని.. ముందు కోవిడ్ రోగులను కాపాడడంపై దృష్టి సారించాలని పవన్ వ్యాఖ్యానించారు.ఓవైపు ఏపీలో కరోనా విజృంభిస్తోందని.. ప్రభుత్వ యంత్రాంగంతో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం ఎంపీ రఘురామను అరెస్ట్ చేయడం ఏమాత్రం సమర్థనీయం అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న కారణంతో ఎంపీ రఘురామను అరెస్ట్ చేయడం ఏమాత్రం సమర్థింపు చర్య కాదని జనసేనాని తెలిపారు.ఏపీలో ఓ పక్క ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లుకు తరలిస్తుండగా.. అవసరమైన మందు కోసం ఏపీలో పది షాపులు తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల బాధలపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. ఈ సమయంలో అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని పవన్ అన్నారు.
ఏపీలో వైద్య సేవలు అందక తెలంగాణ, పక్క రాష్ట్రాలకు వెళుతూ సరిహద్దుల్లో ఏపీ వాసులు చస్తుంటే జగన్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని పవన్ విమర్శించారు. వారిపై కంటే రఘురామ అరెస్ట్ నే ఇప్పుడు ముఖ్యమా? అని పవన్ నిలదీశారు. సొంత పార్టీ ఎంపీని అరెస్ట్ చేయడంపై చూపించిన శ్రద్ధ.. కోవిడ్ రోగులపై చూపించరా? అని పవన్ ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ అన్నయ్య, జనసేన నేత నాగబాబును ఇదే రఘురామకృష్ణంరాజు గత ఎన్నికల్లో ఓడించాడు. అయితే పవన్ మాత్రం తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరెస్ట్ పై స్పందిచడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..!!
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…