Janhvi Kapoor: జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ సాధించడం కోసం కష్టపడుతున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకులకు కూడా ఈమె పరిచయం కాబోతున్నారు.
ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన బవాల్ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఒక ఇంటర్వ్యూలో తన తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇకనటిగా ఇండస్ట్రీలో శ్రీదేవి సినీ ప్రస్థానం ఏంటో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీదేవి 2018లో దుబాయ్ లో మరణించారు. ఇలా ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో
భాగంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
అమ్మ తన సినీ కెరియర్ ను చూడలేకపోయిందని ఈమె తెలిపారు .అమ్మ చనిపోయిన సమయంలో తాను దడక్ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు.అమ్మ మరణం తర్వాత నాకు పరిస్థితులన్నీ చాలా కష్టంగా మారిపోయాయి. అమ్మ లేని లోటును ఎవరు తీర్చలేకపోయారు. ఆ కొద్ది రోజులు కాలంతో తాను పెద్ద యుద్ధం చేస్తూ ఆ బాధ నుంచి బయటపడ్డానని ఈ సందర్భంగా తల్లి మరణం గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…